పోస్ట్‌లు

జులై, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

అనంత సాహితీ విమర్శా వనంలో వికసించిన విమర్శాపుష్పం బి. నాగశేషు

చిత్రం
             'కొలకలూరి ఇనాక్ రచనలు - బహుజన దృక్పథం' పై సిద్ధాంత గ్రంధాన్ని రాసి డాక్టరేట్ పొందిన బి.నాగశేషు అనంతపురం జిల్లాలోని రామగిరి మండలం, గరిమేకుపల్లిలో 1-8-1976లో జన్మించారు. వీరి తల్లిదండ్రులుముత్యాలప్ప, కె. లక్ష్మమ్మ. ప్రాథమిక విద్యను పుట్టిన పల్లెలోనే పూర్తిచేసి, ఇంటర్, డిగ్రీ విద్యను పావగడలో చదివారు. బెంగుళూరువిశ్వవిద్యాలయంలోఎం.ఏ. లో గోల్డ్ మెడల్ సాధించాడు. తరువాత ఇనాక్ రచనలపై పరిశోధన పూర్తిచేసి డాక్టరేట్ సాధించాడు.         'వారధి' (ఆలోచనాత్మక వ్యాసాలు) గ్రంధాన్ని 2015లో వెలువరించి సాహిత్య విమర్శాలోకంలో ఒక మంచి విమర్శా పుష్పంగా వినిపించాడు. పలు అంతర్జాతీయ సదస్సుల్లో అనేక సాహిత్య వ్యాసాలను సమర్పించారు. ఆకాశవాణి,వివిధ సంస్థలు నిర్వహించే అనేక సాహిత్య గోష్టుల్లో పాల్గొన్నాడు. పలు కవితలు రాశాడు. ఒక వైపు సాహిత్య రచన చేస్తూనే మరో వైపు 'సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శిగా కూడా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేవాడు హిందూపురంలో.         వారధి గ్రంథంలో వివిధ సాహిత్యాంశాలపై విశ్లేషణాత్మక, వివరణాత్మక వ...

అరుదైన చిత్రం

చిత్రం
విజయనగర రాజుల కాలం నాటి భవన నిర్మాణశైలికి అద్దంపట్టే అరుదైన చిత్రం తాజాగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన కొందరు వ్యక్తులు లండన్‌లోని బ్రిటిష్‌ లైబ్రరీలో ఆ వర్ణ చిత్రాన్ని  గుర్తించి ఇక్కడి హెరిటేజ్‌ అసోసియేషన్‌ సభ్యులకు పంపారు. 16వ శతాబ్దంలో గిరిదుర్గంగా పేరొందిన రాయదుర్గం శత్రుదుర్భేద్యమైన కోటగా ఉండేది.  కొండపై మాధవరాయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఇది ఉండేది. దీనికి ఇరువైపులా ఉన్న రెండు వాచ్‌ టవర్లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, పురావస్తుశాఖ అధికారులు పురాతన కట్టడాల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టాలి.

20 టీఎంసీల కెపాసిటీతో గాలేరు-నగరిపై ప్రాజెక్టు

చిత్రం
 దశాబ్దాల కాలం పాటు నీటి ఎద్దడిని ఎదుర్కొంటోన్న రాయలసీమలో మరో నీటి ప్రాజెక్టు నిర్మితం కాబోతోంది. పోతిరెడ్డి పాడు ద్వారా కృష్ణా జలాల వరద జలాలు, అదనపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం..తాజాగా మరో రిజర్వాయర్‌ను నిర్మించడానికి ప్రతిపాదనలను రూపొందిస్తోంది. హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా- కడప జిల్లాలో ఈ రిజర్వాయర్‌ను నిర్మించడానికి అవసరమైన కసరత్తు చేపట్టింది ప్రభుత్వం. రాయలసీమ నీటి ఎద్దడిని నివారించడం ద్వారా తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆ ప్రాంతానికి న్యాయం చేసినట్టవుతుందని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలో.. జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలంలో కొత్తగా ఈ ప్రాజెక్టును నిర్మించడానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గండికోట ప్రాజెక్టుకు ఎగవన 10 కిలోమీటర్ల దూరంలో కొత్త ప్రాజెక్టును నిర్మించడానికి జిల్లా జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలను రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. ముద్దనూరు మండలంలో...

New Education Policy 2020

చిత్రం
New Education Policy 2020 is announced by Modi Government 1. 10+2 board structure is   dropped 2. New school structure will be 5+3+3+4 3. Upto 5 pre school, 6 to 8 Mid School, 8 to 11 High School , 12 onwards Graduation 4. Any Degree will be 4 years 5. 6th std onwards vocational courses available 6. From 8th to 11 students can choose subjects  7. All graduation course will have major and minor Example - science student can have Physics as Major and Music as minor also. Any combination he can choose 8. All higher education will be governed by only one authority.  9. UGC AICTE will be merged. 10. All University government, private, Open, Deemed, Vocational etc will have same grading and other rules. 11. New Teacher Training board will be setup for all kinds of teachers in country, no state can change 12. Same level of Accreditation to any collage , based on its rating collage will get autonomous rights and funds. 13. New Basic learning program will be creat...

జి.వెంకటకృష్ణ

చిత్రం
జి.వెంకటకృష్ణ కథకులు, కవి, విమర్శకులుగా ప్రసిద్ధులు. ఏది రాసినా మనసు పెట్టి రాస్తారు. నిజాయితీ నిక్కచ్చితనం ఆయన సొంతం. రాయలసీమ రచయితగా బహుజనుడిగా ఆయన రచనకు మాటకు ఎంతో విలువుంది. అనంతపురం జిల్లాలో బూడిదగడ్డపల్లె (గోరంట్ల మండలం) లో పుట్టారు. హైస్కూల్, (బెస్తరపల్లి కంబదూరు మండలం) ఇంటర్, కళ్యాణదుర్గంలోనూ చదివారు. డిగ్రీ బెంగళూరులో బెంగళూరు యూనివర్సిటీ, ఎం.ఏ. ఎం.ఫిల్ (చరిత్రలో) శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురంలో చదివారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా చేరి యిప్పుడు డిప్యూటీ రిజిస్ట్రార్ హోదాలో వున్నారు. ప్రస్తుతం సమగ్ర సహకార అభివృద్ధి ప్రణాళిక అనే ప్రాజెక్టుకు ఛీప్ ప్రాజెక్టు ఆఫీసర్ గా కర్నూలులో పనిచేస్తున్నారు.  వుద్యోగ రీత్యా ఫస్ట్ పోస్టింగ్ కర్నూలు లో ఇవ్వడంతో కర్నూలులోనే స్థిరపడ్డారు.  వెంకటకృష్ణ సహచరి #కె_సుభాషిణి కూడా కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మాథమెటిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్. కె.సుభాషిణి కథకురాలు.  వెంకటకృష్ణ గాజుల బలిజ కులానికి చెందినవారు! 1994 లో మొదటి కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో వచ్చినప్పటి నుంచీ యి...

రేనాటి చోళులు కడపవాసులేనాటి ఎరిగల్‌.. నేటి ఎర్రగుడివెలుగులోకి తెచ్చిన శాసనాలు

చిత్రం
రేనాటి చోళులు కడపవాసులే  రేనాటి చోళులు కడప జిల్లా వాసులేనని, రేనాటి ధనుంజయుడి తొలి రాజధాని ఎరికల్‌ అయి ఉండొచ్చునని శిలాశాసనాల ద్వారా పరిశోధకులు నిర్ధరణకు వచ్చారు. ఎరికల్‌ పదం కాలక్రమేణా ఎరికల్లు, ఎరిగల్లు, ఎరికాల్వ, ఎరిగల్‌గా రూపాంతరం చెంది ఎర్రగుడి (ఎర్రని ఇటుకలతో నిర్మించిన పాత గుడి)గా మారిందని తెలిపారు. ఎర్రగుడి ప్రస్తుతం కమలాపురంలో ఉంది. రేనాటి చోళులు కర్ణాటకలోని నిడుగల్‌ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారన్న గత అంచనాలకు భిన్నంగా తాజా శాసనాలు సూచిస్తున్నాయని పరిశోధక విద్యార్థి నాగదాసరి మునికుమార్‌ తెలిపారు. కడప జిల్లా సిద్దవటం శివారులోని లంకమల అభయారణ్యంలోని ఇష్టకామేశ్వర నిత్యపూజస్వామి కోవెల పరిసరాల్లో లభ్యమైన శిలాశాసనాలను ఎపీగ్రఫీ డైరెక్టర్‌ మునిరత్నంరెడ్డి ఇటీవల అధ్యయనం చేశారు. ఆ వివరాలను కడప నివాసి మునికుమార్‌ ఇక్కడ వివరించారు. ఆయన బెంగళూరులోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ కళా కేంద్రంలో తాళపత్ర లిపిశాస్త్రంలో పరిశోధనలు చేస్తున్నారు. 1500 ఏళ్ల కిందట వెలసిన నిత్యపూజకోన చరిత్రను అధ్యయనం చేస్తూ రెండేళ్ల క్రితం సమీపంలోని పంచలింగాల గుడి పక్కన ఉన్న కొండపై నాలుగు పురాతన శాస...

గడియారం వేంకట శేషశాస్త్రి

చిత్రం
గడియారం వేంకట శేషశాస్త్రి                      __ఎస్. సంధ్యారాణి              (సేకరణ పిళ్లా విజయ్)           బహుముఖ ప్రజ్ఞాశాలైన గడియారం వేంకట శేషశాస్త్రి కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా నెమళ్ళదిన్నె అగ్రహారంలో 1901లో రామయ్య, నరసమ్మ దంపతులకుజన్మించారు. రూపావతారం శేషశాస్త్రి వద్ద కావ్య నాటకా లంకారాదులను, తర్క, జ్యోతిష, వాస్తు శాస్త్రాలను అభ్యసిం చారు.దుర్భాక రాజశేఖర శతావధానితో కలిసి అవధానాలు చేసిఅవధాన పంచాననుడు'గా సన్మానాలు పొందారు. శాసన మండలి సభ్యుడుగా, సాహిత్య అకాడమీ అధ్యక్షుడుగా బాధ్యత లను నిర్వర్తించారు.          శ్రీనాధ కవితా సామ్రాజ్యము, తిక్కన కళావైదగ్యము, ఉత్తర రామాయణ కావ్యశిల్పము వీరి విమర్శనా గ్రంథాలు, ఉత్తర రామాయణము కావ్య శిల్పము లో గడియారం తిక్కన కృత నిర్వచనోత్తర రామాయణము కంకంటి పాపరాజు  కృత ఉత్తర రామాయణమును గురించిన కావ్య పరిశీలనము చేశారు. ఈ రెండు రామాయణములకు తోడు రామాయణోత్తర  కాండను కూడా తీసుకున్నారు. అలాగే రామాయణ కథా ...