పోస్ట్‌లు

రాష్ట్రకూటులు

రాష్ట్రకూటులు         రాష్ట్రకూటులు భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్య వంశాలలో ఒకటి.             “రాష్ట్రకూట” అనే పదంలో “రాష్ట్ర” అంటే ప్రాంతం అని, “కూట” అంటే అధిపతి లేదా సమూహం అనే అర్థాలు సూచిస్తాయని చరిత్రకారులు భావిస్తున్నారు. మొదట వీరు చాళుక్యుల సామంతులుగా ఉన్నారు. తరువాత స్వతంత్రంగా ఎదిగి సామ్రాజ్యాన్ని స్థాపించారు.      క్రీ.శ. 753లో బాదామి చాళుక్యుల్లో చివరివాడైన రెండో కీర్తివర్మ. వీరికి సామంతుడుగా ఉన్న రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు అతన్ని పారద్రోలి స్వతంత్ర రాష్ట్రకూటరాజ్యం స్థాపించినాడు.  వీరి సామ్రాజ్యం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ భాగాలు, తమిళనాడు భాగాలు,మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది.వీరి ప్రభావం రేనాడు,పాకనాడు వరకు ఉండేది. దంతిదుర్గుడు శ్రీశైలప్రాంతాలనుగూడ జయించి ఆక్రమించినట్లు చెప్పుకున్నాడు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో చాలభాగం రాష్ట్రకూట సామ్రాజ్యంలో చేరింది.వీరు క్రీ.శ. 8వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు దక్షిణ, మధ్య భారతదేశంలో విస్తారమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. ...

అధ్యాయం – 1

​ రాయలసీమ : పేరు, భౌగోళిక స్వరూపం • “రాయలసీమ” అనే పేరు ఎలా వచ్చింది • సీమ అంటే ఏమిటి • కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల భౌగోళిక లక్షణాలు • ఎండలు, వర్షాభావం, రాళ్ల నేల – చరిత్రపై ప్రభావం రాయలసీమ చరిత్ర రచన రాయలసీమ చరిత్ర రచనకు ఉపకరించిన ఆధారాలను ప్రధానంగా రెండు తరగతులుగా విభజించవచ్చు. అవి: 1) పురావస్తు ఆధారాలు 2) వాఙ్మయాధారాలు, 1) పురావస్తు ఆధారాలు : పురావస్తు ఆధారాలను తిరిగి మూడు విధాలుగా విభజించవచ్చు. అవి: 1) శాసనాలు 2) నాణేలు 3) కట్టడాలు (లేక) ఇతర అవశేషాలు. 1) శాసనాలు : భారతదేశ చరిత్రలో మొట్టమొదటి శాసనాలు అశోకుని శాసనాలే. అశోకుని శాసనాలు క్రీ.పూ. 250 ప్రాంతం నాటివి. ఇవి ప్రధానంగా శిలలపైనా, శిలాస్తంభాల పైనా వ్రాయబడినవి. రాయలసీమ లోని ఎర్రగుడి, రాజుల మందగిరి,  కొట్టాంలలో లభించిన అశోకుని ధర్మశాసనాలు ఆంధ్రదేశం మౌర్య సామ్రాజ్యంలో భాగమైందని నిరూపిస్తున్నాయి. అశోకుని శాసనాల తర్వాత పేర్కొనదగినవి క్రీస్తు పూర్వం 2 నుంచి 11వ శతాబ్ధాల మధ్య బహుదా నదీ తీరాన ఆడపూరు వద్ద ఉన్న కొండపై బౌద్ధమత ఆరామాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.  ఇవి క్రీ.పూ. 200 నాటికే బౌద్ధమతం రా...