పోస్ట్‌లు

అక్టోబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

రాయలసీమ కా పేరు ఎలా వచ్చింది?

రాయలసీమ కా పేరు ఎలా వచ్చింది?       1928 వరకు 'రాయలసీమ' అనే పదమే వాడుకలో లేదు. 1928 వరకు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను దత్త మండలాలు (సీడెడ్ డిస్ట్రిక్ట్) అని వ్యవహరించేవారు.  'అభిషిక్త రాఘవం'లో నడిమింటి వెంకటపతి మొదటి సారిగా 'రాయలసీమ' పదాన్ని వాడారని శ్రీ రావినూతల రామారావు గారు (గుత్త కేశవ పిళ్లై జీవిత గాథలో) రాశారు. ఈ పదాన్ని వాడుకలోకి తెచ్చిన కీర్తి ప్రధానంగా హరిసర్వోత్తమ రావు గారికి దక్కుతుంది. 1800 సంవత్సరంలో అప్పటి నిజాం నవాబు తనకు బ్రిటిష్ వారు సహాయం చేశారన్న కారణంతో  ఈస్ట్ ఇండియా కంపెనీకి దత్తత ఇచ్చాడు. అందువల్ల ఈ జిల్లాలను దత్త మండలాలని అనేవారు. దత్త మండలాలు అని పిలిపించుకోవడం అగౌరవంగా భావించిన క నాయకులు 1928 నవంబరు 18వ తేదీన నంద్యాలలో కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన సభ జరిగిన సభలో ఈ ప్రాంతాన్ని 'రాయలసీమ ' అని పిలుచుకోవాలని తీర్మానించారు.  గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు గారు దీనిని ప్రతిపాదించారు.   రాజమండ్రి వ్యవస్థాపకులలో ఒకరైన చిలుకూరి నారాయణరావు  గారు సైతం ఈ సభలో పాల్గొన్నారు. 15వ, 16వ శతాబ్దాలలో విజయనగర పాలకులు నిర్మించిన నీటి వనరు...

బహుముఖ ప్రజ్ఞాశాలి డా|| ఎం.వి.రమణారెడ్డి

చిత్రం
బహుముఖ ప్రజ్ఞాశాలి డా|| ఎం.వి.రమణారెడ్డి                                 ఎం.వి.రమణారెడ్డిగా, ఎం వి ఆర్ గా ప్రసిద్ది పొందిన మల్లెల వెంకట రమణారెడ్డి ప్రొద్దుటూరు లో ఒక పెద్ద వ్యాపార కుటుంబంలో 4.3.1944 లో మల్లెల వెంకటమ్మ, ఓబుల్ రెడ్డి దంపతులకు జన్మించారు.ఆయన జీవితం వైవిధ్య భరితం గా సాగింది. ఆయన గుంటూరు లో యం. బి.బి. ఎస్ చదివాడు. డాక్టరు గా పనిచేశాడు. యల్. ఎల్. బి. కూడా చదివాడు. కొంతకాలం లాయారుగా కూడా పనిచేశాడు.ప్రొద్దుటూరులో డాక్టర్ గా ప్రాక్టీసు ప్రారంభించి  పేదలకు ఉచితంగా వైద్యం చేయడం ప్రారంభించారు. ఆ సందర్భంలో అనేక మంది కార్మికులు ఆయన దగ్గరికి రావడం, వారు తాను రాయించిన మందులు కూడా కొనుక్కోలేని స్థితిని గమనించి, వారి పేదరికాన్ని చూసి చలించి పోయాడు. ఆ క్రమంలో  వారికి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ విధంగా ఆయన కార్మిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు.చదువుకునే రోజుల్లో వామపక్ష భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. అలా అతను రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. అటు తర్వాత ఎన్నో రచనలు చేసి సాహితీవ...