రాయలసీమ : పేరు, భౌగోళిక స్వరూపం
• “రాయలసీమ” అనే పేరు ఎలా వచ్చింది
• సీమ అంటే ఏమిటి
• కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల భౌగోళిక లక్షణాలు
• ఎండలు, వర్షాభావం, రాళ్ల నేల – చరిత్రపై ప్రభావం
రాయలసీమ చరిత్ర రచన
రాయలసీమ చరిత్ర రచనకు ఉపకరించిన ఆధారాలను ప్రధానంగా రెండు తరగతులుగా విభజించవచ్చు. అవి: 1) పురావస్తు ఆధారాలు 2) వాఙ్మయాధారాలు,
1) పురావస్తు ఆధారాలు :
పురావస్తు ఆధారాలను తిరిగి మూడు విధాలుగా విభజించవచ్చు. అవి: 1) శాసనాలు 2) నాణేలు 3) కట్టడాలు (లేక) ఇతర అవశేషాలు.
1) శాసనాలు :
భారతదేశ చరిత్రలో మొట్టమొదటి శాసనాలు అశోకుని శాసనాలే. అశోకుని శాసనాలు క్రీ.పూ. 250 ప్రాంతం నాటివి. ఇవి ప్రధానంగా శిలలపైనా, శిలాస్తంభాల పైనా వ్రాయబడినవి. రాయలసీమ లోని ఎర్రగుడి, రాజుల మందగిరి, కొట్టాంలలో లభించిన అశోకుని ధర్మశాసనాలు ఆంధ్రదేశం మౌర్య సామ్రాజ్యంలో భాగమైందని నిరూపిస్తున్నాయి.
అశోకుని శాసనాల తర్వాత పేర్కొనదగినవి క్రీస్తు పూర్వం 2 నుంచి 11వ శతాబ్ధాల మధ్య బహుదా నదీ తీరాన ఆడపూరు వద్ద ఉన్న కొండపై బౌద్ధమత ఆరామాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇవి క్రీ.పూ. 200 నాటికే బౌద్ధమతం రాయలసీమ లో వ్యాపించిన విషయాన్ని తెలుపుతున్నాయి.
తూర్పు చాళుక్య యుగం నుండి శాసనాలలో తెలుగు భాష వాడకం ప్రారంభమైంది. బ్రాహ్మీలిపి తెలుగు లిపిగా పరిణామం చెందింది. అయిననూ సంస్కృత భాషా, దేవనాగరి లిపి శాసనాలలో విధిగా ఉపయోగింపబడేవి.
అశోకుని కాలం (క్రీ.పూ. మూడో శతాబ్దం) నుండి ఇక్ష్వాకుల కాలం (క్రీ.శ. నాలుగో శతాబ్దం) వరకు రాయలసీమ లో ప్రాకృతమే శాసన భాషగా వాడబడింది.
తెలుగు భాషలో లభించిన మొట్టమొదటి శాసనాలు అనంతపూర్, కడప జిల్లాలలో లభించిన రేనాటి చోళులవి. ఇవి క్రీ.శ. ఆరు, ఎనిమిది శతాబ్దాల మధ్య కాలానివి.
(ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర_పి వి కె ప్రసాదరావు)
రాయలసీమ చరిత్ర: ప్రాచీన, శాసన, కుల, భాషా వైవిధ్యం
రాయలసీమ చరిత్ర భారతదేశపు ప్రాచీన ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక విలువలను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుత కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, మరియు ప్రకాశం జిల్లాల చారిత్రక ప్రాముఖ్యత అనేక యుగాల నుండే స్పష్టమవుతుంది. రాయలసీమ చరిత్రను ప్రధానంగా నియోలితిక్ కాలం, శిలా శాసనాలు, దక్షిణ రాజవంశాలు, మరియు సంస్కృతిక ప్రాశస్త్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు.
1. ప్రాచీన కాలం – నియోలితిక్ సంస్కృతి
రాయలసీమ ప్రాంతం అనేక నియోలితిక్ (కొత్త రాయి యుగం) ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది.
ప్రధాన స్థానాలు:
కడప జిల్లాలో:
హనుమంతరావు పేట, పెద్దముడియం, బలిజపల్లె, మైలవరం, చింతకుంట, పులివెందుల, వేముల, యల్లతూరు.
అనంతపురం జిల్లాలో:
వెలుగోడు, తాడిపత్రి, గుత్తి, బుక్కాపట్టణం.
కర్నూలు జిల్లాలో:
అహోబిలం, మానtralayam పరిసర ప్రాంతాలు.
సంస్కృతికి ముఖ్యాంశాలు:
వ్యవసాయం & పశుపోషణ:
ఈ ప్రాంతాల్లో వ్యవసాయానికి అనువైన మట్టితో పాటు పెన్నా, కుందేరు నదుల తీరాలు నీటిపారుదల అభివృద్ధికి అనుకూలంగా ఉండేవి.
పశుసంవర్థన ప్రధాన జీవనమార్గం.
పురావస్తు తవ్వకాలు:
చింతకుంట వద్ద లభించిన రాతి పరికరాలు, పూర్వ రామాయణ కాలపు కళాశిల్పాలు, చిప్పల వంట కుండలు ఇటీవలి సంస్కృతిని సూచిస్తాయి.
2. శిలాశాసనాల ప్రాముఖ్యం
రాయలసీమ ప్రాంతం మౌర్యులు, శాతవాహనులు, చాళుక్యులు, మరియు విజయనగర సామ్రాజ్యాల క్షేత్రంగా ఉన్న కారణంగా అనేక శిలాశాసనాలకు కేంద్రంగా ఉంది.
ముఖ్య శాసనాలు:
1. జొన్నగిరి శిలాశాసనం (కడప జిల్లా):
ఆశోకుని ధర్మ ప్రచారం గుర్తింపుగా ఈ శాసనం ఎంతో ప్రాచుర్యం పొందింది.
2. రాయచోట్ల శాసనాలు (అనంతపురం జిల్లా):
రాజసత్కారం, దాతృత్వం, మరియు సామాజిక వ్యవస్థ స్థితి ప్రతిబింబించే శాసనాలు.
3. కర్నూలు శాసనాలు:
అహోబిలం మరియు మనtralayam పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటిచెప్పే శాసనాలు.
3. రాజవంశాలు – పాలనాధిపత్యం
కాకతీయులు (ప్రతాపరుద్రుడు):
రాయలసీమలో త్రిలింగ ప్రాంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఉద్ధరించారు.
రాయలసీమలో వాణిజ్యం, కళాశిల్పం, మరియు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కారణమయ్యారు.
విజయనగర సామ్రాజ్యం:
ఈ ప్రాంతం విజయనగర రాజ్య పాలనలో కీలక భాగంగా ఉంది.
రాయలసీమ పేరు కూడా విజయనగర రాజుల నుండి ఉద్భవించింది. "రాయల" అనే పదం విజయనగర రాజులను సూచిస్తుంది.
పెనుగొండ రాజధాని (అనంతపురం జిల్లా):
విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా ఈ ప్రాంతం గుర్తింపబడింది.
పెనుగొండ గోపురాలు, ఆలయ నిర్మాణాలు, మరియు కళా సంపద ప్రాచీన భారతదేశ సాంకేతికతను చూపిస్తాయి.
4. భాషా వికాసం
తెలుగు భాష ఆవిర్భావం:
కడప మరియు పరిసర ప్రాంతాల్లో నన్నయ భట్టుడు ఆధ్వర్యంలో తెలుగు భాషకు ప్రారంభ బీజాలు ఉన్నాయి.
రాయలసీమ ప్రాంతంలోని వేములవాడ, నండ్యాల, మరియు పులివెందుల ప్రాంతాలు అనేక తెలుగు కవులకు స్వస్థలం.
మల్లియ రేచన రాసిన కవిజనాశ్రయం తెలుగుభాష యొక్క పురాతనతను ప్రతిబింబిస్తుంది.
5. ఆర్థిక వ్యవస్థ & వ్యవసాయ ప్రాధాన్యత
రాయలసీమలో వ్యవసాయ ఆర్థికత ప్రధానంగా గోధుమలు, జొన్నలు, పత్తి, కందులు, చెరకు పంటలపై ఆధారపడి ఉండేది.
తుమకూరు, చిత్తూరు ప్రాంతాల్లో కాంస్య ధాతువులు విస్తృతంగా లభించాయి.
6. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
శైవ & వైష్ణవ క్షేత్రాలు:
రాయలసీమలో అహోబిలం (నరసింహ క్షేత్రం), శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.
మంత్రాలయం (రాఘవేంద్రస్వామి మఠం) వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన ముఖ్య క్షేత్రంగా ఉంది.
త్రిలింగ ఆధ్యాత్మిక భావన:
శ్రీశైలం, కాళేశ్వరము, దక్షారామం ప్రాంతాలు రాయలసీమ ప్రాచీన శైవ సంప్రదాయాన్ని సూచిస్తాయి.
7. చరిత్రక ప్రాముఖ్యత
రాయలసీమ అనేది ప్రాచీన వ్యవసాయ ఆధారిత సమాజాలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, మరియు రాజకీయ కేంద్రముగా నిలిచింది. నియోలితిక్ శకము నుండి విజయనగర సామ్రాజ్యానికి దారితీసే ఈ ప్రాంత చరిత్ర భారతదేశం మొత్తానికి గర్వకారణం.
గ్రామ నామాలు, శిలాశాసనాలు, మరియు కళాశిల్పాలు ఈ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతకు సాక్ష్యం.
రాయలసీమ చరిత్ర భారతీయ సంస్కృతిలో ఒక విశిష్టమైన అధ్యాయం.
(AI ChatGPT ఆధారంగా)
రాయలసీమ లో సామాజిక పరిస్థితులు ( క్రీ.పూ.400 నుండి క్రీ.శ.1565 వరకు ) (ఇనుప యుగం నుండి విజయనగర రాజుల కాలం వరకు)
ఒక భౌగోళిక ప్రాంతం రాయలసీమ పేరుతో అవతరించడానికి 1928 నాటికి సాధ్యమైంది.ఇనుప యుగంలో కొన్ని గ్రామ సముదాయాలతో ఉండింది ఈ ప్రాంతమంతా. జనపదాల నుంచి రాచరిక వ్యవస్థ లోకి వచ్చిన తర్వాత ఆ నాటి రాజుల శాసనాల ఆధారంగా మనకు కొన్ని సామాజిక పరిస్థితులు తెలుస్తున్నాయి. అయితే రాయలసీమ ప్రాంత సామాజిక పరిస్థితులు విజయనగర రాజుల కాలం నుండి వివిధ రచనల ద్వారా తెలుస్తున్నాయి. అందువల్ల రాయలసీమ ప్రాంతాన్ని ఆనాటి మొత్తం తెలుగు సమాజపు సామాజిక పరిస్థితులలో భాగంగానే పరిశీలించాల్సి వుంటుంది.
క్రీ.పూ.4వ శతాబ్దం నాటికే ఆంధ్రులకు 30 నగరాల సామాజిక , రాజకీయ వ్యవస్థలుండేవని మెగస్తనీస్, తరువాత ఏరియన్ అనే గ్రీకు రచయితలు రాశారు .
కోటిలింగాల , పెద్ద బంకూరు , ధూళి కట్ట , ఎమునూరు మొదలైన స్థలాల తవ్వకాలలో లభించిన క్రీ.పూ.5 - 3 శతాబ్దాల నాటి పంచ్ మార్క్ డ్ నాణేలు , కుండ పెంకులు , ఇనుప వస్తువులు ఆనాటికే జనపదాలున్నాయని రుజువు చేస్తున్నాయి .
తెలుగు నేలపై ఇనుప యుగపు చివరి రోజుల్లో రాచరిక వ్యవస్థ కు దారితీశాయి. చారిత్రక తొలియుగమైన క్రీ . పూ . 6 , 5 శతాబ్దాల కాలంలో ఉత్తరాదిలో మాదిరిగా తెలుగు ప్రాంతం గోదావరి లోయలో అశ్మక , ములక , మజీరక ( మోసలి ) లాంటి జనపదాలు ఉండేవి.కృష్ణాజిల్లా కేసరపల్లి అమరావతి ప్రాంతాల్లో దొరికిన లిపిలేని నాణ్యాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అంతేగాక బుద్ధునికి సమకాలికుడైన బావరి అనే బౌద్ధ చార్యుడు క్రీ.పూ.6వ శతాబ్దం లో ఉత్తర భారతదేశం నుంచి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఈ జనపదాల సరిహద్దుల్లో ఆశ్రమాన్ని నిర్మించుకుని విద్యా బోధన చేశాడని సుత్తనిపాతం అనే బౌద్ధ గ్రంథం చెబుతోంది. అటు తర్వాత రాయలసీమ ఆంధ్ర ప్రాంతం మౌర్య చక్రవర్తి అశోకుని పాలనలోకి వచ్చినట్లు కర్నూలు జిల్లా ఎర్రగుడి, రాజుల మందగిరి, అమరావతి శాసనాల వల్ల తెలుస్తోంది. అశోకుని తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని రేనాటి చోళులు పాలించినట్లు కడప జిల్లా లో దొరికిన శాసనాల వల్ల తెలుస్తోంది. వీరంతా శాతవాహనులకు ముందరిరాజులు.
క్రీ.పూ.9వ శతాబ్దినాటికే ఆంధ్రులకు సమాజం , రాజకీయ వ్యవస్థలు ఉన్నాయని రుగ్వేద సంబంధ ఐతరేయ బ్రాహ్మణం , మహాభారతం, రామాయణం లాంటి ఇతిహాసాలు తెలియచేస్తున్నాయి .
తెలుగు ప్రాంతంలో స్పష్టంగా తెలుస్తున్న మొదటి స్వతంత్ర రాజవంశం, సామ్రాజ్యం శాతవాహనులది . వీరు సుమారు క్రీ . పూ .80 నుండి క్రీ . శ . 230 సంవత్సరాల మధ్య అఖిలాంధ్ర దేశాన్ని , ఇతర దక్కను రాష్ట్రాలను పాలించారు. శాతవాహన చక్రవర్తి హాలుడు సంకలనం చేసిన గాధాసప్తశతి, గుణాఢ్యుని బృహత్కథ, శర్వవర్మ సంస్కృతం లో రాసిన స్వాతంత్ర వ్యాకరణం, వాత్సాయన కామ సూత్రాలు శాతవాహన కాలం నాటి గ్రంథాలలో పేర్కొనదగినవి. వీరి అనంతరం ఇక్ష్వాకులు కృష్ణానదీ లోయలో తెలంగాణ , రాయలసీమ , కోస్తాంధ్ర మధ్య కూడలి ప్రాంతాన్ని విజయపురి నుండి క్రీ . శ . 225 నుండి 300 వరకు పాలించారు . వీరికి ఇంచు మించుసమకాలికులుగా శకులు (విదేశీయులు) అభీరకులు తెలంగాణాలోను , బహఫలస లేదా బృహత్పలాయనుల జయవర్మ ( శకులు ) కృష్ణానది
ఉత్తర ముఖద్వారం లోను (క్రీ.శ. 300 - 325) పాలించారు . శాలంకాయనులు మొదట శాతవాహన సామంతులుగా ఉండి సా . శ . 320 నుండి 455 వరకు ఉత్తర తీరాంధ్ర ప్రాంతాన్ని వేంగీ రాజధానిగా పాలించారు . వీరికి ( కృష్ణానదికి ) దక్షిణంగా కర్మ రాష్ట్రాన్ని కందారపురం రాజధానిగా ఆనంద గోత్రీకులు (క్రీ.శ.350 - 525 ) పాలించారు .
దక్షిణంగా తమిళనాడులోని కంచి రాజధానిగా పల్లవులు (క్రీ.శ.300 - 630) ఆంధ్రప్రదేశ్ లో కృష్ణకు దక్షిణంగా గల *రాయలసీమ*ను , నెల్లూరు , ప్రకాశం , గుంటూరు జిల్లాల వరకు గల ప్రాంతాలను పాలించారు.
శాతవాహనుల తర్వాత వారిలో విష్ణుకుండినులు కృష్ణా - నర్మదా నదుల మధ్య ప్రాంతాన్ని క్రీ . శ . 375 - 612ల మధ్య పాలించారు . వీరి అనంతరం 18 సంవత్సరాలు గోదావరి , ఖమ్మం , నల్గొండల ప్రాంతాన్ని రణదుర్జయులు , గోదావరి ప్రాంతాన్ని మూలరాజు వంశస్థులు పాలించారు.వీరి తరువాత బాదామి(తూర్పు లేదా వేంగీ) చాళుక్యులు (క్రీ.శ.616_1075) మహబూబ్ నగర్ కర్నూల్ మధ్య సంగమేశ్వరం లేదా తుమ్మెయనూరులో పుట్టి పశ్చిమంగా విస్తరించారు.
వీరికి సామంతులుగా కడప , కర్నూలు , చిత్తూరు ప్రాంతాన్ని రేనాటి చోళులు ( క్రీ.శ. 550 - 750 / 850 ) పాలించారు.రేనాటి చోళులు రాయలసీమలో 7000 గ్రామాల తో కూడిన కడప కర్నూలు చిత్తూరు ప్రాంతాలను పాలించారు వీరు చంద్రవంశజులమని, కరికాల వంశజులమని చెప్పుకున్నారు.వాళ్లు మొదట పల్లవులకు తర్వాత పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు రేనాటి చోళులు దాదాపు మూడు వందల సంవత్సరాలు పరిపాలించారు. వీరు 13 మంది రాజులున్నారు.
క్రీ.శ.575లో కడప జిల్లా కమలాపురం మండలం లోని కలమల్లలో ఎరికల్ ముత్తు రాజు బిరుదు గల ధనంజయుడనే రాజు రేనాడును పరిపాలిస్తున్న కాలంలో వేయించిన శాసనం , కమలాపురం లోని ఎర్రగుడిపాడు దగ్గర లభించిన క్రీ.శ.600 నాటి శాసనం, కమలాపురంలోనే ఇందుకూరు లో ధనంజయుని కొడుకు చోర మహారాజు వేయించిన శాసనం,వీరి పాలన రాయలసీమ లో ఉన్నట్లు ధృవ పరుస్తున్నాయి. క్రీ.శ. 643 లో తూర్పు చాళుక్య రాజైన జయసింహ వల్లభుడు వేసిన విప్పర్ల చేజెర్ల శాసనం కూడా ఇందుకు ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.
రేనాటి చోళుల పతనం తర్వాత రాయలసీమ లో చాలా కాలం అతిపెద్ద రాజ్యం ఏదీ పరిపాలించ లేదు. వీరి తర్వాత బాణులు(క్రీ.శ.795_911),నొలంబులు(క్రీ.శ.770-975),వైదంబులు(క్రీ.శ.910-970) పాలించినట్లు తెలుస్తోంది. వీరు కూడా పల్లవులకు పశ్చిమ చాళుక్యులకు చోళులకు సామంతులుగా వ్యవహరిస్తూ వాళ్ల బిరుద నామాలను ధరించారు. వీర చరిత్ర గొప్పగా లేకపోయినా తెలుగు భాషా సాహిత్య చరిత్రలో వీరికి గొప్ప స్థానం ఉంది. రాయలసీమ లోని కొన్ని ప్రాంతాలను చోళులు కూడా పరిపాలించినట్లు తెలుస్తోంది.తెలుగు చోడ వంశానికి చెందిన జటాచోట భీముడు(క్రీ.శ.973-1000) కర్నూలు జిల్లా పెడకల్లు నుంచి పాలించేవాడు. చోళ చక్రవర్తి రాజేంద్రుడు తన సైన్యాధిపతి చోళ వీరాయన్ ను పంపి కుంతల, తెలుంగు,కళింగ,వడ్డె రాజ్యాలను జయించి వేంగీశ్వరునిగా ప్రకటించుకున్నాడని అనంతపురం జిల్లా కొత్త శివారం శాసనంలో ఉంది.ఇతను తన కుమార్తె అమ్మంగదేవిని రాజరాజు కిచ్చి వివాహం చేసి క్రీ.శ.1022లో అతనిని పట్టాభిషిక్తున్ని చేశాడు. రాజరాజు ఆస్థాన కవి నన్నయ. ఇతను సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. ఇలా కేవలం చిన్న చిన్న రాజ్యాధినేతలుగా ఉండి పరస్పరం కలహించు కుంటూ ఉండేవారు. వీరిలో చాలామంది తెలుగు ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూటులకు, తర్వాత కాకతీయు లకు సామంతులుగా ఉన్నారు. మొత్తం మీద చూస్తే, మనం రాయలసీమగా పిలుస్తున్న మొత్తం ప్రాంతాన్ని పాలించిన రాజులు రేనాటి చోళులు మాత్రమే. ఆ తరువాత విజయ నగర రాజులు.
తెలుగువారైన విజయనగర రాజులు సా.శ.1485 నుండి ఎక్కువగా రాయలసీమ ను కొంత కాలం కోస్తాంధ్రను , ఆగ్నేయ తెలంగాణాలను పాలించారు. కానీ సా.శ. 1565లో జరిగిన తల్లికోట యుద్ధంలో ఇతర బహమనీ రాజులతో కలిసి కుతుబ్ షాహీలు వీరిని ఓడించడంతో వీరి పాలన అంతమైంది. మహమ్మదీయుల పాలన ప్రారంభమైంది.
విజయనగర రాజులలో శ్రీకృష్ణదేవ రాయలు(క్రీ.శ.1509-క్రీ.శ.1529) అగ్రగణ్యుడు.ఇతను క్రీ.శ. 1509లో సింహాసనం అధిష్టించాడు. రాయలు పరిపాలించింది 20 సంవత్సరాలు మాత్రమే. ఆ కొద్ది కాలంలోనే అనేక విజయాలను సాధించి సామ్రాజ్యాన్ని నిర్మించాడు.సాహిత్య పోషకునిగా, కళా పోషకుడిగా అజరామరమైన కీర్తిని సంపాదించాడు. ఇతను కర్ణాటక ఆంధ్ర సంస్కృత భాషలలో విద్వాంసుడు. ఆంధ్ర భోజుడుగా కీర్తింపబడినాడు. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. అల్లసాని పెద్దన అతని ఆస్థాన కవి.రాయలు తెలుగులో ఆముక్తమాల్యద రాశాడు. భువనవిజయం అన్న ప్రసిద్ధమైన రాయల దర్బార్ లో వేడుకలు జరిగేవి. కృష్ణదేవరాయల ఆస్థానంలో తెలుగు కవులే కాక సంస్కృత తమిళ కర్ణాటక భాషా కవులు కూడా ఆదరణ పొందారు.ఈయన కాలంలోనే పురందరదాసు కనకదాసు లు కీర్తన రాసి దాస సాహిత్యాన్ని పరాకాష్టకు చేర్చారు.రాయల కాలంలో వచ్చిన కావ్యాలకు ప్రబంధాలు అని పేరు. పెద్దన రాసిన మనుచరిత్ర, రామరాజభూషణుడు వసుచరిత్ర మొదలైన ప్రబంధకావ్యాలన్నీ రాయల కాలంలోనే రాయబడిన స్వతంత్ర కావ్యాలు.
శాతవాహనులు , ఇక్ష్వాకులు మౌర్యుల పాలనా విధానాన్ని అనుసరించారు. చాళుక్యులు విభిన్న పాలనా
విధానాన్ని ప్రవేశపెట్టారు . కాకతీయులు జనరంజకమైన
' నాయంకర ' పాలనా విధానాన్ని ప్రవేశపెట్టి స్థానిక పాలనకు అవకాశమిస్తూ పాలించారు . వీరి విధానాన్నే విజయనగర రాజులు కూడా పాటించారు.
ఆంధ్రరాజులు ఎక్కువగా బ్రాహ్మణ , క్షత్రియ వరాలను , సూర్య చంద్ర వంశాలను తమ మాతృకగా చెప్పుకున్నారు . ఉదాహరణకు విష్ణుకుండినులు " బ్రహ్మక్షాత్ర తేజోభృతాం " అని , శాలంకాయనులు చతుర్వేదులైన రథకారులమని , చాళుక్యులు చంద్రవంశ క్షత్రియులమని చెప్పుకున్నారు.కాని అమ్మ రాజు,దానార్ణవుడు,కామార్ణవుడు, రాజరాజనరేంద్రుడు లాంటి పేర్లను బట్టి,వరాహం లాంటి రాజ చిహ్నాలను బట్టి చూస్తే వీరు మొదట శూద్రులే అని , చిరకాలం పాలించి తమను తాము క్షత్రియులుగా ప్రకటించుకొన్నారని తెలు స్తోంది. అభీరకులు , బృహత్పలాయనుల లాంటి విదేశీ శక యవనులు,ఆటవిక జాతులు కూడా పాలక వంశాలయ్యాయి. వీరు బ్రాహ్మణులతో సామంతులతో,శకులతో వైవాహిక సంబంధాలు పెట్టుకొని వర్ణసంకరం చెందారు. కానీ వీరు మాత్రం ఇతరులు వర్ణధర్మాన్ని అతిక్రమించి, వర్ణసంకరం కాకుండా చూసేందుకు బ్రాహ్మణులకు అగ్రహారాలు, మాన్యాలిచ్చారు.బ్రాహ్మణ విద్యాలయాలను(ఘటికలను) పోషించారు.
ఆర్యుల దండయాత్రల వల్ల ఆంధ్రులనే ద్రావిడ తెగ ఉత్తరదేశంనుండి ఇక్కడకు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే చాలామంది జైనులు , బౌద్ధులు, బ్రాహ్మణులు కూడా ఉత్తర భారత దేశం నుండి తెలుగు ప్రాంతానికి వలస వచ్చారు. వీరి రాకతో తెలుగు ప్రజల సంస్కృతి లో కూడా పలుమార్పులు వచ్చాయి. తూర్పు చాళుక్యుల కాలంలో
రాయలసీమలోని కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర దానవులపాడు ఒక గొప్ప జైనక్షేత్రంగా వర్ధిల్లింది. కడప జిల్లాలోని సిద్ధవటం , అనంతపురం జిల్లాలో ని పేరూరు,కొనకొండ్ల,కంబదూరు రాయదుర్గం, కర్నూలు జిల్లాలో ఆదోని, పెద్ద తుంబలం వద్ద జైనస్థావరాలు నెలకొన్నాయి. చోళుల కాలంలో కూడా జైన మతం రాయలసీమలో అక్కడక్కడ నిలదొక్కుకుంది. బౌద్ధమతం కొద్దిగా నిలబడింది. .ఎర్రబాలెం లోని బౌద్ధ విహారానికి వెలనాటి చోళులు దానాలు చేశారు. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం, తిక్కన రాసిన నిర్వచనోత్తర రామాయణం చాళుక్య చోళుల కాలంలో వచ్చాయి. బ్రాహ్మణులు 9వ శతాబ్దం వరకు సమాజంలో ఎక్కువ గౌరవం పొందారు. వీరికున్న పాండిత్యం కారణంగా అనేక పదవులు అనుభవించారు. 11వ శతాబ్దం నాటికి వీరిలో వైదికులు , నియోగులు అనే శాఖలు ఏర్పడ్డాయి. వీరికి పాలకులు అగ్రహారాలు, మాన్యా లిచ్చి వైదిక ,వర్ణధర్మాలనుద్ధరించడానికి ఉయోగించారు . ఘటికల్లో (విద్యాకేంద్రా)ల్లో వీరే గురువులు.పౌరోహిత్యం వీరి ప్రధాన వృత్తి.అయినప్పటికీ శాలంకాయనులు చతుర్వేద రథకారులు అనడాన్ని బట్టి వీరు అక్కడక్కడ శూద్ర వృత్తులను అనుసరించారని అర్థమవుతోంది . కాకతీయులు రాక పూర్వం రాజకీయ అనైక్యత ఉండటం వల్ల, శూద్రులకు సైనిక , ఉద్యోగ వ్యవస్థల్లో ప్రాధాన్య మివ్వడం వల్ల బ్రాహ్మణులు కర్నాటకకు, తమిళనాడుకువలసపోయారు. వారి మాతృస్థానాన్ని బట్టి వారిలో ఆరువేలనాటి , వేగినాటి,ములికినాటి , కమ్మనాటి అనే భేదాలు వచ్చాయి. కందుకూరు నెల్లూరు మధ్య గల ప్రాంతాన్ని పాకనాడు, కడప, కర్నూలు మధ్య గల ఈ ప్రాంతాన్ని రేనాడు, మాచర్ల గురజాల ను పల్నాడు, ఒంగోలు బాపట్ల నరసరావుపేట లను కమ్మనాడు అని పిలిచేవారు ఆ రోజుల్లో.ఆయా ప్రాంతం నుంచి వచ్చిన దాన్ని బట్టి బ్రాహ్మణులను ఆయా బ్రాహ్మణులుగా పిలిచేవారు. కమ్మనాడు బ్రాహ్మణులను కమ్మనాటి బ్రాహ్మణులుగా పిలిచేవారు.
శాతవాహనులు , ఇక్ష్వాకుల కాలంలో వైశ్యులు నిగమసభలు ఏర్పాటు చేసుకొని శ్రేష్టి ఆధ్వర్యంలో దేశ , విదేశ వర్తక - వాణిజ్యాలు నిర్వహించేవారు . నగర పాలనలో వీరిది ప్రధానపాత్ర. తెలంగాణలో వీరిని కోమట్లు అంటారు . బోధన్ రాజదేవుడు గోమఠేశ్వరుని భక్తులు కాబట్టి వారికా పేరు వచ్చింది అంటారు . ఇక్ష్వాకుల అనంతరం విదేశీ వాణిజ్యం క్షీణించడంతో స్థానికంగా వస్తువులు అమ్మటం , వడ్డీ తాకట్టు వ్యాపారం చేయడం వీరి వృత్తి అయింది . 6,7 శతాబ్దాలలో మనకు కనిపించే గౌరులు, గౌడ ప్రాంతం( నేటి బెంగాల్ ) నుండివచ్చారు. బలిజలు ( బాహుబలి గోమఠేశ్వరుడు ) కూడా కోమట్లే . తూర్పు చాళుక్యుల కాలంలో వర్తక సంఘాలను నకరములు అన్నారు. ఈ నకర మునకు అధిపతిని శ్రేష్టి అనేవారు.వీరిలో అనేక శాఖలు ఏర్పడ్డాయి . 714 గోత్రాలు , కమ్మనాటి లాంటి ప్రాంతీయ భేదాలున్నాయని చెపుతారు.
ఎక్కువగా శూద్రవర్ణంలోనే ఉపవర్గాలు , కులాలు ఏర్పడ్డాయి. వ్యవసాయం,వర్తకం,ఇతర సేవలు చేయడం వీరి ప్రధాన వృత్తి ( ధర్మం ).శాతవాహనుల కాలం నుండే మనకు నేత , వడ్రంగం . గోవులు మేపడం లాంటి వృత్తులు ఉండేవి. చాళుక్యుల కాలంలో పశువుల సహాయంతో వ్యాపారులకు వర్తక సామాగ్రిని చేరవేసే వారిని పెరికలు అనేవారు . గ్రామాలలో చేతివృత్తులు వీరివే . నిజానికి ఆంధ్ర దేశాన్ని పాలించిన వెలనాటి చోడులు , బోయలు మొదలైన వారంతా శూద్రులే. క్షాత్రధర్మాన్ని అనుసరించి,
క్షత్రియులతో వివాహ సంబంధాలు నెరిపి క్షత్రియులైనారు . పుళింద అనే శూద్ర వర్ణాన్ని నాలుగు వర్ణాల రక్షణకై బ్రహ్మదేవుడు సృష్టించారని రాయించు కున్నారు.
12వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చిన కుల వ్యతిరేక మత శాఖలు వీరశైవం,వీరవైష్ణవం ఆవిర్భవించాయి.ఆవి కుల నిర్మూలన చేయకపోగా లింగాయత,సాతాని,బలిజ అనే కొత్త కులాల సృష్టికి కారణమయ్యాయి .
క్రీ.శ.7,8శతాబ్దాలలో యుద్దావసరాల కోసం రాజులు శూద్రులను సైనికులుగా, రాజోద్యోగులుగా నియమించు కున్నారు. అలాంటి వారిలో పంట కాపులైన రెడ్లు, వెలమలు ప్రధానమైన వారు. వీరే తదనంతర కాలంలో స్వతంత్ర రాజులయ్యారు.
ఒక శతాబ్దిన్నర కాలం వీరు పాలించారు.కానీ వీరు పరస్పరకలహాల వల్ల తమ రాజ్యాలు కోల్పోయారు. రెడ్లు , వెలమల తరువాత కమ్మలు , కాపులు బలపడ్డారు . ఈ కారణాల వలన శూద్రులకు సమాజంలో అగ్రతాంబూలాలు అందుకునే పై మూడు వర్ణాలైన ద్విజులకు ఉండే విద్యాభ్యాసం లాంటి అర్హతలు లేకపోయి నప్పటికీ 11వ శతాబ్ది కల్లా సుగుణాలు కలిగిన శూద్రులుగా ' సచ్చూద్రులై' అగ్రవర్ణ అర్హతను సమాజంలో సాధించుకొన్నారు.
విజయనగర రాజుల కాలానికల్లా అన్ని వర్ణధర్మాల్లో మార్పులొచ్చాయి. బ్రాహ్మణుల్లో పూజారులు , మఠాధిపతులు , భూస్వాములు , మంత్రి , దండనాయక మొదలగు ఉద్యోగులు , వర్తకులు , భోక్తలు అనే వర్ణాలున్నాయని సమకాలీన యాత్రికులు బార్బోసా , పేస్ అభిప్రాయపడ్డారు . అర్చకులు , పూజారులు దేవద్రవ్యాన్ని హరించి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారు . వైశ్యులు వాణిజ్యంలో నీతి తప్పారు . పంచాణం వారు దొంగసొమ్ము (లోహాలను ) కొనే వారని 'వైజయంతీ విలాసం'లో పేర్కొన్నారు.
క్రీ . పూ . 6వ శతాబ్దపు ఇనుప యుగం కాలానికే వ్యవసాయదారులు చర్మకారులను, వారి వృత్తిని చండాలమైనదిగా , అనారోగ్యకరమైనదిగా భావించి సమాజానికి దూరంగా ఉంచారని తెలుస్తోంది. అయితే బౌద్ధమతంలో వీరిపై ఎలాంటి బేధభావాలు లేవనడానికి నిదర్శనం విధిక అనే చర్మకారుడు ధాన్యకటక స్తూపాన్ని కుటుంబ సమేతంగా దర్శించి దానం చేశాడనే శాసనం లభించడం . అయితే హిందూ మతంలో
బ్రాహ్మణ స్త్రీకి , శూద్ర పురుషుడికి పుట్టిన సంతానాన్ని చండాలులగా మనుస్మృతి చెప్పింది.అందువల్ల
అధికారులుగా, చారులుగా , భటులుగా అంటరానివారు అగ్రహారాలలో ప్రవేశించి బ్రాహ్మణుల నుంచి సొమ్మును వసూలు చేయడం లాంటి అసాంఘిక చర్యలు చేపట్టరాదనే నిబంధనలుండేవి.
మాలలు , మాదిగలు , చండాలులు , మాతంగులు , అంతేవాసినులు , నిషాదులు మొదలైనవారు ఊరు చివరన వెలివాడల్లో జీవించేవారు. వీరందరిని ఇప్పుడు దళితులుగా ప్రభుత్వం పేర్కొంది.' సగం సాలె నేత సగం మాల నేత ' అనే తెలుగు సామెతను బట్టి , ఇప్పటికీ కొందరు మాలలు మంచం , నులక , వ్యవసాయోపయోగ తాళ్లు అల్లడాన్ని బట్టి వీరు సమాజానికి ఉపయోగపడే పనులే చేశారన్నది
స్పష్టంగా తెలుస్తుంది. మాదిగలు కూడా పశువుల చర్మముతో చెప్పులు , ఆరుతాళ్ళు,చాలకోల ( ఎద్దులను అదిలించే కర్రలకు ) అల్లడం , డప్పులు చేయడం , చనిపోయినవారి శవాలను మోయడం , కాటికాపరులుగా ఉండటం , శుభ - అశుభ కార్యాలకు డప్పులు వాయించడం లాంటి సమాజోపయోగ పనులను చేసేవారు . వీరశైవం , శాక్తేయం వంటి మత శాఖలు కొంత కుల నిర్మూలనకు కృషి చేసి పంచములకు సమానత్వాన్ని ఇచ్చాయి.కాకతీయ పాలెగాళ్ల సేనలలో మాల మాదిగలు చాలామంది ఉండేవారు.
శాతవాహనులు బౌద్ధ మతాన్ని ఆదరించారు. బౌద్ధం కుల వ్యవస్థ లేని సమాజాన్ని ప్రోత్సహించింది. స్త్రీలకు పురుషులతో పాటు సమాన హక్కులు ఇచ్చింది.అందువల్ల ఈ కాలంలో స్త్రీలకు గొప్ప గౌరవమర్యాదలు ఉండేవి. పురుషులు తమ తల్లుల పేర్లను తమ పేర్లతో కలిపి పెట్టుకునేవారు. స్త్రీలకు ఆస్తి హక్కు స్వేచ్ఛ ఉండేది స్త్రీలు చాలామంది బౌద్ధ మత అభిమానులుగా ఉండేవారు. వీరు బౌద్ధ విహారాలకు విరాళం ఇచ్చేవారు. హాలుని కంటే ముందు కూడా స్త్రీలు సాహిత్య సభలలో పాల్గొనేటంతటి ఉన్నత స్థానంలో ఉండేవారు. కాని బౌద్దం క్షీణించడంతో సమాజంలో వారి స్తితి క్రమంగా తగ్గిపోయింది.
హిందూ మతంలో సాంఘిక దురాచారాలైన బాల్య వివాహాలు , బహుభార్యత్వం , వరకట్నాలు , ఓలి వివాహాలు , ఉంపుడుగత్తెతనం , దేవదాసీ - ఆడపాప వ్యవస్థలు , వేశ్యావ్యవస్థ , సతీసహగమనం , నిర్బంధ వైధవ్యం మొదలైనవన్నీ స్త్రీల పాలిట శాపాలుగా మారాయి. వారి హక్కులను హరించి వారిని భోగ వస్తువులుగా చూసే పరిస్థితి దాపురించింది. అయితే ఉంపుడుగత్తెలు , సానులు - దేవదాసీలు , వేశ్యల ను సామాజిక అవసరంగా మార్చేసింది రాచరిక వ్యవస్థ.అయితే వారికి సమాజంలో గౌరవమే ఉండేదని తెలుస్తోంది .
కాకతీయుల నాగన్న మంత్రి ' అంగనా హృదయ సరోజ షట్పదము ' అని , మరో రాజు 'రాయవేశ్యాభుజంగ ' అని బిరుదులను ధరించడం , ఊరేగింపులు తదితర ప్రజా ఉత్సవాల్లోనే ఉంపుడు గత్తెలతో సరసమాడటం నాటి రాచరిక వ్యవస్థ లో గొప్ప విషయాలైనాయి.రాజాస్థానానికి వెళ్ళేందుకు ఉంపుడు గత్తెలకు సరాసరి ప్రవేశముండేది . ప్రతాపరుద్రుని ఉంపుడు గత్తె మాచల్దేవికి ఢిల్లీ సురత్రాణి కంటే ఎక్కువ విలువ ఉండేదిట . సర్వజ్ఞ సింగభూపాలుడు పోతన చేత తన ఉంపుడుగత్తెపై ' భోగినీ దండకా ' న్నే రాయించాడు . కుమారగిరి రెడ్డి లకుమ పై మోజుతో ' వసంతరాజీయం ' అనే సంగీత నృత్య ప్రధాన గ్రంథాన్ని రచించాడు. రాజులు కవులను ఏనుగు లెక్కించారు, కనకాభిషేకాలు చేశారు. కానీ వారు కవుల కన్నా ఎక్కువగా, ఉంచుకున్న ఉంపుడుగత్తెలకే గౌరవం ఇచ్చారు. భోగకాంతలకే ఎక్కువగా బహుమతులిచ్చే వారు. వారి భోగా లాలసత్వాన్ని కీర్తించిన ఈ కాలాన్ని ప్రబంధ యుగమని సాహితీ విమర్శకులు పేర్కొన్నారు.
ఉత్తేజకర తాంబూలం వేసుకొని విజయనగర రాజు 200 మందికి పైగా ఉంపుడుగత్తెలతో భోగింపగలిగేవాడని చెపుతూ అబ్దుర్ రజాక్ ఆశ్చర్యపడ్డాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో రాయలసీమ భోగభాగ్యాలతో తులతూగినట్లు చాలా మంది చరిత్రకారులు వర్ణించారు. రాయలనాటి రసికత గురించి రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ ,పుట్టపర్తి సత్య నారాయణ చార్యులు వారి భోగప్రవృత్తి గురించి వర్ణించారు.
ఈ భోగాలన్నీ రాజులు, రాజ బంధువులు,రాజ ప్రతినిధులు ఉన్నతాధికారులు అనుభవించేవారు. వాటిని అనుభవించడానికి వారికి కావాల్సినంత ధనం, విశ్రాంతి, ఆరోగ్యం,ముఖ్యంగా నైతికత పట్ల నిరాదరణ ఉండటమే కారణం. ఇవన్నీ సాధారణ ప్రజానీకానికి ఉండే అవకాశం మాత్రం లేదు.
(అనంతసాగరం దినపత్రికలో ప్రచురితం)
__పిళ్లా కుమారస్వామి
9490122229
రాయలసీమ కా పేరు ఎలా వచ్చింది?
1928 వరకు 'రాయలసీమ' అనే పదమే వాడుకలో లేదు. 1928 వరకు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను దత్త మండలాలు (సీడెడ్ డిస్ట్రిక్ట్) అని వ్యవహరించేవారు.
'అభిషిక్త రాఘవం'లో నడిమింటి వెంకటపతి మొదటి సారిగా 'రాయలసీమ' పదాన్ని వాడారని శ్రీ రావినూతల రామారావు గారు (గుత్త కేశవ పిళ్లై జీవిత గాథలో) రాశారు. ఈ పదాన్ని వాడుకలోకి తెచ్చిన కీర్తి ప్రధానంగా హరిసర్వోత్తమ రావు గారికి దక్కుతుంది. 1800 సంవత్సరంలో అప్పటి నిజాం నవాబు తనకు బ్రిటిష్ వారు సహాయం చేశారన్న కారణంతో ఈస్ట్ ఇండియా కంపెనీకి దత్తత ఇచ్చాడు. అందువల్ల ఈ జిల్లాలను దత్త మండలాలని అనేవారు. దత్త మండలాలు అని పిలిపించుకోవడం అగౌరవంగా భావించిన క నాయకులు 1928 నవంబరు 18వ తేదీన నంద్యాలలో కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన సభ జరిగిన సభలో ఈ ప్రాంతాన్ని 'రాయలసీమ ' అని పిలుచుకోవాలని తీర్మానించారు. గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు గారు దీనిని ప్రతిపాదించారు. రాజమండ్రి వ్యవస్థాపకులలో ఒకరైన చిలుకూరి నారాయణరావు గారు సైతం ఈ సభలో పాల్గొన్నారు. 15వ, 16వ శతాబ్దాలలో విజయనగర పాలకులు నిర్మించిన నీటి వనరులు తప్పిస్తే, బ్రిటీష్ పాలకుల వల్ల తమకు కొత్తగా ఏర్పడిన నీటి వనరులు ఏవీ రాయలసీమలో లేవు. కరువు కాలంలో దత్త మండలాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస పోయారని పెద్దలు చెబుతారు.
*AP: పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ..*
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. 2022 ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభమవుతుంది.
26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో గెజిట్ . ఈ క్రమంలో పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.
*రాయలసీమలో కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..*
19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)
20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్ (కొత్త), నంద్యాల
21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్ (కొత్త)
22. సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)
23. వైఎస్సార్ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు
24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)
25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)
26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.
*కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య..*
- కర్నూలు జిల్లా.. 26 మండలాలు
- నంద్యాల జిల్లా.. 29 మండలాలు
- అనంతపురం జిల్లా.. 31 మండలాలు
- శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు
- వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు
- అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు
- చిత్తూరు జిల్లా.. 31 మండలాలు
- తిరుపతి జిల్లా.. 34 మండలాలు
రాయలసీమ లో కాలువలు
హంద్రీ_నీవా సుజల స్రవంతి కాలువ రాయలసీమలోనే పెద్ద కాలువ.అయినప్పటికీ దీన్లో ఒక టిఎంసి లోపు నీరు కూడా పారడంలేదు.దీని మార్గంలో హంద్రీ,పెన్నా, చిత్రావతి, పాపాగ్ని, మాండవ్య, బాహుదా,గార్గేయ నదులు ఉన్నాయి . . ఈ కాలువ కాలువ రాయలసీమలోని నాలుగు
జిల్లాలకు సాగునీటినందిస్తుంది.దీనికి సమాంతర కాలువ నిర్మిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పారు.వాస్తవ రూపం దాల్చేదెప్పుడు?
కె . సి . కెనాల్ . దీనినే కర్నూల్ - కడప కాలువ అంటారు . దీన్ని 150 సంవత్సరాలకు పూర్వమే నిర్మించారు .
కర్నూల్ జిల్లాలో సుంకేసుల బేరేజ్ నుండి మొదలైన ఈ నీటి పారుదల కాలువ కడప , కర్నూలు జిల్లాల్లో సాగునీటిని , తాగునీటిని అందిస్తుంది.
రాయలసీమలోని ప్రధాన నదులు - వాటి పేర్ల అర్థాలు
“కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” – జే. విల్కిన్సన్
ఇది కడప గురించి చెప్పబడ్డా, మొత్తం రాయలసీమకు అన్వయించవచ్చు. కృష్ణా, పెన్నా నదులే కాక అనేక నదులు రాయలసీమ జిల్లాల ద్వారా ప్రవహిస్తున్నాయి.
కృష్ణా నది - కృష్ణవేణి - నల్లని నది - నల్లని జడ - కృష్ణ(కణ్ణ) వెణ్ణ(వేణి) నదుల సంగమం - నల్లరేగడి భూముల మీదుగా ప్రవహించునది. శ్రీశైలం వద్ద ఆనకట్ట కట్టబడింది.
తుంగభద్ర - తుంగ నది , భద్ర నది కలయిక వలన ఏర్పడినది - కృష్ణా నదికి అతి పెద్ద ఉపనది. మల్లాపురం వద్ద తుంగభద్ర బ్యారేజీ ఉన్నది. ప్రసిద్ద క్షేత్రమైన మంత్రాలయం వద్ద ఈ నది రాయలసీమలో ప్రవేశించి ఆలంపూర్ వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
పాపాఘ్ని - పాపాలను దహించునది - పెన్నా నదికి ఉపనది - వేంపల్లి వద్ద పాపాఘ్ని తీరంలోనే గండి ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ప్రసిద్ద శైవ క్షేత్రం వీరపునాయుని పల్లె వద్ద కల సంగమేశ్వర ఆలయం కూడా పాపాఘ్ని తీరాన ఉన్నది.
పెన్నా -ఉత్తర పినాకిని - పినాకిని అంటే పినాక నుండి ఉద్భవించింది అని అర్థం. శివుని ధనస్సు పినాక రెండు నంది కొండల వద్ద రెండు పాయలుగా ఉత్తర పినకిని (పెన్నా) దక్షిణ పినాకిని(పాలారు) నది అయ్యాయి. ప్రసిద్ద క్షేత్రాలు తాడిపత్రి ఆలయాలు, పుష్పగిరి, గండికోట ఈ నదీ తీరంలోనే ఉన్నాయి
చెయ్యేరు - సంస్కృతంలో బాహుద అని కూడా పేరు - అంటే చెయ్యి ఇచ్చునది అని అర్థం - పెన్నానదికి ఉపనది- ఈ నది తీరంలోనే అత్తిరాల ఆలయ క్షేత్రాలు, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. చెయ్యేరు నది మీద ఆకేపాడు వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు ఉన్నది. ఈ నది పేరు వెనక ఒక కథ ఉన్నది. లిఖితుడు అను బ్రాహ్మణుడు ఒకరోజు ఆకలితో యజమాని అనుమతి లేకుండాఒక తోటలోని చెట్టు పండ్లు తిని, తన తప్పును పొత్తప్పి రాజు దగ్గర అంగీకరించగా, రాజు ఆ బ్రహ్మణుడికి దండనగా చేతులు ఖండించగా, లిఖితుడు తరువాత ఈ నదిలో మునిగి లేయగా తన చేతులు తనకు తిరిగి వచ్చాయి. చెయ్యి ఇచ్చిన నది చెయ్యేరు
కుందేరు - కుందూ నది - సంస్కృతంలో కుముద్వతి అని పేరు - కుముద్వతి అంటే తెల్ల కలువ తీగ - సీతారాముల కుమారుడు కుశుడి భార్య పేరు కూడా కుముద్వతి. కర్నూలు జిల్లాలో సున్నపు నేలల మీదుగా ప్రవహించటం వల్ల తెల్లగా ఉన్న నీటి వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతమే రేనాటి సీమ
స్వర్ణముఖి - శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే అది వారికి కష్టానికి తగిన ప్రతిఫలం విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చింది. మరో కథ ప్రకారం ఆగస్త్యుని తపస్సు మేరకు శివుని అనుగ్రహం వలన గంగమ్మ స్వర్ణ కాంతులతో భూమి మీదకు వచ్చింది కాబట్టి స్వర్ణముఖి అయ్యిందని ఈ నదీ తీరంలో ఇసుక రేణువులు బంగారు వర్ణంలో ఉండటం చేత స్వర్ణముఖి అయ్యిందని ఇంకో కథనం. ప్రసిద్ద శైవ క్షేత్రాలు అయిన కాళహస్తి, గుడిమల్లం ఈ నది తీరంలో ఉన్నాయి. తిరుపతి ప్రధాన నీటి వనరు కళ్యాణి డాం కూడా స్వర్ణముఖి నది మీదే ఉంది.
మాండవ్య నది - బాహుదా నదికి ఉపనది. మాండవ్య మహర్షి పేరు మీద ఈ పేరు వచ్చి ఉండవచ్చు. రాయచోటి వీరభద్రాలయం ఈ నది ఒడ్డున ఉంది
హగరి - వేదవతి : అఖ(పాపాలు) హరి(హరించేది) - పాపాలు హరించే నది కాబట్టి హగరి - ఈ నదినే వేదవతి అని కూడా అంటారు. ఈ నది తుంగభద్ర నదికి ఉపనది
ఇవే కాక ఇతర ముఖ్య నదులు - పింఛా (బాహుదా నది ఉపనది) హంద్రీ (ఆంధ్ర అన్న పదం హంద్రీ నుంచి వచ్చింది అంటారు), సగిలేరు(స్వర్ణబాహు), వక్కిలేరు, చిత్రావతి(పుట్టపర్తి ఈ నదీ తీరంలోనే ఉంది), గాలేరు, నీవా, కాళంగి, పీలేరు నది బుగ్గవంక (కడప పట్టణం మీదుగా ప్రవహిస్తుంది) కుషావతి /కుశావతి (బహుశా సీతారామచంద్రుల కుమారుడు కుశుడు పేరు మీద ఈ పేరు వచ్చి ఉండవచ్చు ) జయమంగళ మొII
దురదృష్టవశాత్తూ వీటిలో జీవనదులు అతిస్వల్పం. దీనికి పాలకుల నిర్లక్ష్యం తోడవడంతో ఇన్ని నదులున్నా రాయలసీమ కరువు కోరల్లో విలవిలలాడుతోంది. ఈ దురవస్థ చూసే పెన్నేటి పాటలో విద్వాన్ విశ్వం గారు ఇలా రాశారు
ఇంత మంచి పెన్నతల్లి
ఎందు కెండి పోయెనో?
ఇంతమంది కన్న తల్లి
ఎందు కిట్లు మారెనో?
___రవితేజ రెడ్డి
తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ
ఇనుప యుగం కంటే ముందు నుంచి రాయలసీమ ప్రాంతంలో ఆదిమానవులు ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాంతంలో జనపదాలు ఏర్పడి ఉండాలి. పైగా భాష కూడా ఏర్పడి ఉండాలి. జనపదాలు పెద్దవై రాజ్యాలు ఏర్పడిన తర్వాత తొలి శాసనాలు రాయలసీమలోనే లభించాయు. దీన్నిబట్టి తెలుగువారు రాయలసీమ వారై ఉంటారని భావించవచ్చు . క్రీ.శ.6వ శతాబ్దం నాటికి దానిని రేనాడు అనిపిలిచే వారు.రేనాడు ఏడువేల గ్రామాల సముదాయం.దీనిని రేనాటి చోళులు పాలించేవారు. కర్నూలు జిల్లా ఎర్రగుడిపాడు ఎర్రగుడి దగ్గర లభించిన శాసనాల ద్వారా సీమాంధ్ర ప్రాంతం మౌర్య చక్రవర్తి అశోకుని పాలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొనే తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ తర్వాత తెలంగాణ అని తుర్లపాటి రాజేశ్వరి పేర్కొన్నారు.
క్రీ.శ.575లో కడప జిల్లా కమలాపురం మండలం లోని కలమల్లలో ఎరికల్ ముత్తు రాజు బిరుదు గల ధనంజయుడనే రాజు రేనాడును పరిపాలిస్తున్న కాలంలో వేయించిన శాసనం తెలుగులో వుంది. కమలాపురం లోని ఎర్రగుడిపాడు దగ్గర లభించిన క్రీ.శ.600 నాటి శాసనం కూడా తెలుగులోనే వుంది. కమలాపురంలోనే ఇందుకూరు లో ధనంజయుని కొడుకు చోర మహారాజు కూడా ఒక శాసనాన్ని తెలుగులో వేయించాడు.క్రీ.శ. 630 నాటి కమలాపురం లోని తిప్పలూరు శాసనం కూడా తెలుగులో ఉంది. క్రీస్తు శకం 643 లో తూర్పు చాళుక్య రాజైన జయసింహ వల్లభుడు వేసిన విప్పర్ల చేజెర్ల శాసనాలు ఆనాటి తెలుగుభాషకు అద్దం పడుతున్నాయి. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో చాళుక్య సేనాని పండరంగడు వేయించిన అద్దంకి శాసనం ఉంది.అది తరువోజ లో ఉంది.చాళుక్య భీముడు వేయించిన శాసనం సీస,గీత పద్యాలలో, యుద్ధ మల్లుడి బెజవాడ శాసనం మధ్యాక్కర లో రాశారు. ఇవన్నీ నన్నయకు పూర్వం శాసనాలు. దేశీయమైన కవితలు.
క్రీ.శ.575 నాటి నుంచే తెలుగు లిపి పరిణామం చెందుతూ వచ్చింది. ఇది బ్రాహ్మిలిపి నుంచి వచ్చింది.
భారతదేశంలోని లిపులన్నింటికి మూలం బ్రాహ్మీ లిపే.ఇది అశోకుని కాలానికి ముందే రెండు శాఖలుగా చీలిపోయింది.1.ఉత్తర బ్రాహ్మీ లిపి 2.దక్షిణ బ్రాహ్మీ లిపి.
ఉత్తర భారతదేశంలోని లిపులన్నింటికి మూలం "ఉత్తర బ్రాహ్మీ లిపి" కాగా,, దక్షిణ భారత దేశంలోని లిపులన్నింటికి "దక్షిణ బ్రాహ్మీ లిపి" మూలాధారం.
ఈ విధంగా దక్షిణ భారతంలోని తమిళభాష, మలయాళ భాష,, కన్నడ భాష,, తెలుగు భాష, మొదలగు భాషల లిపులన్నింటికి దక్షిణ బ్రాహ్మీ లిపినే మూలాధారం. దక్షిణ బ్రాహ్మీ లిపి నుండి 11 వ శతాబ్దం కాలంలో 'కదంబ' లిపి నుండి కన్నడ, తెలుగు లిపులు ఏర్పడ్డాయి. ప్రారంభంలో తెలుగు,కన్నడ లిపులు ఒకే రకంగా ఉండేవి. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు.
నన్నయకు పూర్వం తెలుగు కన్నడభాషలకు ఒకే లిపి ఉండేది. దానిని తూర్పు చాళుక్య లిపి లేదా
వేంగీచాళుక్య లిపి అనేవారు.నన్నయకు ముందు శాసనాలన్నీ వేంగీచాళుక్య లిపిలోనే రాసినారు. ఆ లిపిలో తాటాకుపైనగాని గంటంతో రాసేటప్పుడు తలకట్లు దీర్ఘాలు రాస్తే తాటాకు చినిగిపోయేది. నన్నయ దీనికి పరిష్కారంగా ఇప్పటి తలకట్లను దీర్గాలను రూపొందించాడు.
భాషాపరంగా కన్నడ తమిళ భాషలు ద్రావిడ కుటుంబానికి చెందినవి. అయితే, ఆ మూలభాష నుండి ఒక భాష ముందుగా విడివడింది. ఆ భాష క్రమేపీ కన్నడ, తెలుగు భాషలుగా విడిపోయింది. విడిపోయినా లిపి మాత్రం ఒకటే ఉంది. ఆ లిపి కన్నడ భాషకి స్థిరపడగా, సా. శ. 10..11 శతాబ్దాల నాటికి ప్రత్యేకంగా తెలుగుకు కూడా లిపి ఏర్పడింది. కన్నడ లిపికి చాలా సమీపంగా ఉన్న లిపిలో వేసిన శాసనాలను "తెలుగన్నడ" (తెలుగు+ కన్నడ) శాసనాలు అన్నారు చరిత్రకారులు. కానీ ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆంధ్ర కర్నాట దేశాలను పాలించడంవల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామము చెందింది.కాల గమనంలో రెండు భాషలకు వేరు వేరు లిపి రూపొందింది.
____ పిళ్లా కుమారస్వామి,949012229
రాయలసీమ లో నూతన శిలాయుగం
పులివెందుల తాలూకా వేములలో, కడప సమీపంలోని వెల్లటూరులో, కదిరి తాలూకా ముండ్లవారిపల్లె దొరిగల్లులో అనేక తరహాల పనులకుపయోగపడే నూతన శిలాయుగపు పనిముట్లు దొరికినాయి. వెల్లటూరులో దొరికిన చిన్న తోటలో సున్నం లాంటి పదార్థం కనిపించింది. దానిని బట్టి ఆనాడు తాటి కల్లు పరిశ్రమ వుండేదని వూహిస్తున్నారు. ముండ్ల వారి పల్లెలో శంకు చిప్పల కంకణాల పరిశ్రమ గుర్తులు కనిపించినాయి.
http://dsal.uchicago.edu/reference/gaz_atlas_1909/fullscreen.html?object=33%22 కర్నూలులో నూతన శిలాయుగపు పరికరాలు దండిగా దొరికినాయి. పత్తిపాడు వద్ద జాడీలు, చుట్టగుదురులు, లోటాలు, మాదిరి చిన్న పాత్రలు, కుదురు బిళ్ల, చిన్న గుర్రపుబొమ్మ, ఇంకా అనేకానేక ఆసక్తికరమయిన వస్తువులు దొరికినాయి. భారతదేశంలో మరెక్కడా దొరకని కొమ్ముకుండ ఒకటి ఇచ్చట దొరికింది. బహుశ పాలు, పెరుగులకు దీనిని ఉపయోగించి వుంటారని అనుకుంటున్నారు. ఇది ప్రస్తుతం మద్రాసు మ్యూజియంలో వుంది. పత్తికొండ తాలూకా కప్పతల్లి మిట్టమీద, వస్తువులు మెరుగు పెట్టేందుకు వుపయోగించిన గాడి పల్లాలు దొరికాయి. ఆనాడు సున్నపురాతితో బండి చక్రాలు తయారు చేసేవారని తెలుస్తున్నది. నూతన శిలాయుగపు ప్రారంభదశలో జనం గుహలు మొదలైన ప్రకృతి సిద్దమయిన రక్షణ ప్రదేశాలలోనే వుండేవారు. సేద్యాలు చేసేవారు.భారత పురావస్తుశాఖ వారి 1968 నాటి పరిశోధనలలో ఈ విషయం బయట పడింది.
కడప జిల్లా ఎర్రగుంట్ల అనివేములలో చాలా సమాధులు (సిస్ట్లు) దొరికాయి. వాటిని అక్కడివారు పాండవగుళ్లు అంటారు. చిత్తూరు జిల్లాలో నవీన శిలాయుగం నుండి మానవులు నివసించినట్టు అక్కడ కనిపించే పాండవ గుళ్ల వలన తెలుస్తున్నది. టాలేమి, ప్లినీ రాత ప్రతుల్ని బట్టి కోరమండల్ చేరిన ఈ ప్రాంతం క్రీ.శ.1వ శతాబ్దానికి జనవాహితమయినట్టు తెలుస్తున్నది.
అనంతపురం పట్టణానికి 12 మైళ్ల దూరాన వున్న కాలమేదునూరు మిట్ట మీద నూతన శిలాయుగపు వుత్తర దశ నాటి జనావాసం కనబడింది. నూతన శిలాయుగపు జనావాసం తరువాత ఇక్కడే ఇనుప యుగం ప్రారంభమయినట్టుగా తెలుస్తున్నది. గుంతకల్లు రైల్వేస్టేషన్కు సమీపంలో నూతన శిలాయుగపు, ఇనుప యుగపు జనావాసాలు పక్కపక్కనే కనిపించాయి. ఈ జిల్లాలో ముదిగల్లు, దేవాదుల బెట్ట మాల్వవంతం, కొండాపురం, పూతేరులలో సిస్ట్లు కనిపించాయి. ముదిగల్లులో ఈ సిస్ట్లు 6-7 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో చెదిరి వున్నాయి. రాయలసీమను మౌర్యులు, పల్లవులు, శాతవాహనులు, చాళుక్యులు పరిపాలించారు. క్రీ.శ. 3వ శతాబ్దంలోచిత్తూరు జిల్లా పల్లవుల రాజ్య పాలన కింద ఉండేది. అనంతపురం జిల్లా అశోకుని తర్వాత పల్లవుల పాలనలోకి వచ్చింది. శాతవాహన పతనానంతరం క్రీ.శ. 2వ శతాబ్దంలో కడప జిల్లా పల్లవుల పరిపాలన కిందకొచ్చింది. కర్నూలు జిల్లా తెలుగు చోళుల పాలనలో ఉండేది. ఆంధ్రదేశాన్ని దీర్ఘకాలం పరిపాలించి, ఆంధ్ర చరిత్రలో కొన్ని నూతన అధ్యాయాలను నెలకొల్పిన చాళుక్యుల జన్మస్థలం కడప జిల్లా. ప్రాచీన కాలంలో ఈ జిల్లాను హిరణ్య రాష్ట్రమని పిలిచేవారు. బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందులు సంఘర్షిస్తున్న కాలంలో రాయలసీమకు చెందిన రేనాడులో తెలుగు చోళులు పరిపాలించేవారు. ఈ కుటుంబానికి చెందిన కరికాలచోళుడు, త్రిలోచనపల్లవుడనే 4వ విజయస్కంద వర్మను ఓడించాడు. ఈయనే చోళ వంశారంభకుడు. ఇతని వారసులు కడప జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల తాలూకాలను క్రీ.శ. 700 వరకు పరిపాలించినారు. మదనపల్లె తాలూకాలోని చిప్పిలి వారి రాజధానిగా వుండేది. క్రీ.శ. 5,8 శతాబ్దాల మధ్య కడప, కర్నూలు జిల్లాలను పాలించిన రేనాటి చోళులు తమ శాసనాలలో ప్రాచీన తెలుగును ఉపయోగించినారు. ఈనాడు వానిని అర్థం చేసుకోవడం కష్టం. రేనాటి చోళులు తెలుగు పద్యానికి రాజాదరణ నిచ్చినారు.
కొంతకాలం పల్లవులకిందా, మరి కొంతకాలం చాళుక్యుల కిందా సామంతులుగా వుండిన రేనాటి చోళులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలు, మండలాలుగా విభజించినారు. మండలాలను గ్రామాలుగా విభజించినారు. పశుసంపదను రక్షించటంలో ప్రాణాలు అర్పించిన వీరుల సంస్మరణార్థం ఆనాడు నాటిన రాతిస్థంభాలు రాయలసీమ గ్రామాలలో నేటికీ వున్నాయి. ఆనాటి చోళరాజులు అనేక చెరువులు తవ్వించినారు.
కాకతీయులు తమ రాజ్యాన్ని రేనాడు, మురికినాడు, ఏరువనాడులుగా విభజించి పరిపాలించారు. కడప, కర్నూలు జిల్లా భాగాలు ఏరువనాడుగా విభజింపబడినాయి. కాకతీయులు వ్యవసాయాన్ని బాగా అభివృద్ది చేసినారు. భూములను కొలిచి తరగతుల కింద విభజించారు. భూసారాన్ని బట్టి పన్నులు విధించారు. కాలువలు, చెరువులు తవ్వినారు. అంజూపురం లాంటి కొన్ని గ్రామాలు వెలిసాయి. "పొత్తపినాడు పౌరులు అత్తిరాళ్లలోని పరమేశ్వర దేవాలయంలో సభ జరిపి చెయ్యేరు దక్షిణపు ఒడ్డున కరకట్ట పోసి పరమేశ్వర దేవాలయానికి వరద ముంపు కాకుండా చెయ్యటానికై గ్రామానికో మాడ వసూలు చేయ నిశ్చయించినారు'' అని ఒక శాసనం తెలుపుతోంది. కర్నూలు జల్లా అడవిగా వుండటం చూసి ప్రతాపరుద్రుడు ఉత్తర దిశ నుంచి నీటి పారుదలకు ప్రోత్సాహం ఇచ్చినాడు. అడవి కొట్టించి, గ్రామాలు నిర్మించి భూముల్ని ఉచితంగా ఇచ్చినాడు.
*రాయలసీమలో కొత్త రాతి యుగపు (Neolithic Period) అవశేషాలు*
కొత్త రాతి యుగం 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమై 4000 సంవత్సరాల వరకు సాగింది. ఈ యుగంలోనే మనిషి ఒకచోట స్థిరంగా ఆహారాన్ని వ్యవసాయం చేయడం ద్వారా ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాడు. దానికోసం శిలాపనిముట్లను తయారు చేసుకున్నాడు.
దాంతో గ్రామాలు ఏర్పడినాయి. నాగరిక జీవనానికీది నాంది పలికింది. ఈ కాలపు అవశేషాలు తెలుగు రాష్ట్రాల్లో 4000 ఏళ్ల కింద కనిపించాయి.
చరిత్రపూర్వయుగానికి పితామహుడిగా పేరొందిన రాబర్ట్ బ్రూస్ ఫుట్ కడప జిల్లాలో హనుమంతరావు పేట, పెద్దముడియం, బలిజపల్లె లో , అనంతపురంజిల్లాలో 25 స్థావరాల్లో త్రవ్వకాలు జరిపి ఈ యుగానికి చెందిన ఆధారాలు వెలికితీశాడు.
పశువుల పేడను కుప్పగా కాల్చడం వల్ల ఏర్పడిన బూడిద కుప్పలు (ash mounds)
అనంతపురం జిల్లాలోని పాలవాయి, కర్ణాటకలోని కుపల్, పిక్లిహాల్లో కనిపించాయి. కానీ ఇవి వైఎస్ఆర్ జిల్లాలో కనిపించలేదు.
ధర్మోలు మినిసెన్స్ పద్ధతి ద్వారా ఈ బూడిద దిబ్బలు సుమారు క్రీ.పూ 2000 కాలంలో కాల్చినవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనిని బట్టే అప్పటి ప్రజలు వ్యవసాయం, పశుపోషణపైన ఆధారపడ్డారని నిర్ధారించారు. ఈ కాలంలో జొన్న, రాగి, ఉలవ, పెసర మొదలైన పంటలు పండించారు. కర్నూలు జిల్లాలో రామాపురంలో బార్లీ, మినుములను ఎక్కువగా పండించారు.ఈ కాలం నాటి వ్యవసాయ క్షేత్రాలు అనంతపురం జిల్లాలోని పాలవాయి, లత్తవరం, కర్నూలు జిల్లాలోని బేతంచర్లలో కనిపించాయి.
వ్యవసాయం చేయడానికి పశువులు అవసరం అయ్యాయి. దానికోసం గేదెలు(ఎనుములు), ఆవులు, మేకలు, గొర్రెలు, పందులను పెంచారు. కుక్క, ఎద్దు, మొదలైన జంతువులను మచ్చిక చేసుకున్నారు.
నియోలిథిక్ మనిషి సాగుతో పాటు, వేట, చేపలు పట్టడం అతనికి సహజంగా లభించే పండ్లు, కూరగాయలు, తినదగిన గడ్డి లేదా దుంపలు వంటివాటిపై ఆధారపడి ఉన్నాడు.
ఆది మానపుడు కుండలు తయారు చేయడం నేర్చుకుంది ఈ యుగంలోనే.మొదట్లో కుండలను చేత్తో తయారు చేసి, పట్టుకొని కాల్చాడు. ఆ కుండ అడుగు భాగం కాలి ఎర్రగా వుంది. పై భాగం కాలకుండా నల్లగా ఉంది. చేతి గుర్తులు కూడా ఉన్నాయి. కుమ్మరి సారెను తరువాత కొనుక్కున్నాడు. కుండలతో పాటు అన్ని రకాల పాత్రలను తయారు చేసుకున్నాడు.రాతి విగ్రహాలను కూడా తయారు చేశాడు.ఈ యుగపు ఆనవాళ్లు కడప జిల్లాలోని మైలవరంలో ఎక్కువగా కనిపించాయి. పులివెందుల, వేముల, ఎల్లటూరు,పెద్దముడియం బలిజేపల్లి లో ఎరుపు రంగులో పెయింట్ వేయబడిన కుండలు కొన్ని తవ్వకాల్లో లభించాయి. కార్బన్ డేటింగ్ పద్ధతిలో ఇవి క్రీ.పూ. 1540, క్రీ.పూ. 1100 మధ్య కాలానికి చెందినవిగా నిర్ధారించారు. ఇవి దాదాపు కర్ణాటకలోని వాట్ గల్ ప్రాంతంలో లభించిన కుండల కాలానికి సమకాలీనంగా ఉన్నాయి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలానికి చెందిన వేల్పుమడుగు గ్రామప్రాంతంలో మూపురం గల ఎద్దులు ఎదురెదురుగా ఉన్న చిత్రం లభ్యమైంది.తెనగల ప్రాంతంలో ఎరుపు రంగులో ఉన్న కుక్క, జింక చిత్రాలు లభించాయి.
చెర్ట్ (సహజంగా ప్రకృతిలో లభించే పదునైన రాయి)నుంచి చిన్న బ్లేడ్లు తయారు చేసి వాటిని బహుశా బార్బ్లు లేదా బాణం తలలుగా ఉపయోగించేవారు.లేదా వాటిని కత్తులు, కొడవళ్లు లాగా ఉపయోగించేందుకు రెసిన్(బంక)తో చెక్క ముక్క లకు లేదా ఎముకకు అమర్చబడి ఉండవచ్చు.
ప్రధానంగా గొడ్డలి, సుత్తి, ఉలి అనే పనిముట్లు ఉపయోగించారు. వీటికొరకు నల్లశాణం, బసాల్ట్, చెర్ట్ శిలను వాడారు. ఆయుధాలు డోలమైట్ తో తయారుచేశారు.
గుంటూరు జిల్లాలోని వడ్డమాను గ్రామం దగ్గర ఈ కాలపు రాతి గొడ్డలిని కనుగొన్నారు. రాయితో చేసిన బ్లేడులు కూడా దొరికాయి. బేతంచర్ల (కర్నూలు జిల్లా), వీరాపురం, నాగార్జునకొండ, గిద్దలూరు, తాడిపత్రి మొదలైన ప్రాంతాల్లో కొత్త రాతి యుగపు పనిముట్లు లభించాయి. బండి చక్రాన్ని కూడా ఈ యుగంలోనే కనుగొని బండ్లను తయారు చేసుకున్నాడు. పిడికర్ర పెట్టేందుకు చెక్కిన రాతి ముక్క లభించినది
గిడుగనూరు వద్ద ఒకవిధమైన పాలరాతితో చేసిన కత్తులు లభించాయి. తెలంగాణా లోని కరీంనగర్ జిల్లా కు చెందిన కదంబాపూర్ లో పనిముట్లు తయారు చేసే కేంద్రం కూడా ఒకటి బయటపడింది.
వలయాకృతిలో రాళ్లను పేర్చి కర్రలను కడ్డీలుగా అమర్చి, రెల్లుగడ్డితో కప్పును వేసుకున్నారు.ఇంటి వెనుక నుండి జంతువులు దాడి చేయడానికి వీలు లేకుండా, ఇళ్ళను ఒకదానికి మరొకటి అనించి నిర్మించుకున్నారు.ఇటువంటి ఇళ్ల ఆనవాల్లు వైఎస్ఆర్ జిల్లాలోని పెద్దముడియం
లో ఇలాంటి అవశేషాలు రెండు గుర్తించారు.
ఇవి 1540 В.С.,1100 В.С.కాలానికి చెందినవిగా రేడియో కార్బన్ ద్వారా నిర్ధారించారు.
అనంతపురం జిల్లాలోని హుళికల్లు, లత్తవరం, మహబూబ్ నగర్ జిల్లాలోని చినమారూరులో కూడా ఇలాంటి వే కనిపించాయి.టెక్కల్కోట (కర్ణాటక) వద్ద 3 మీటర్ల నుండి 5 మీటర్ల వ్యాసం కలిగిన చిన్న వృత్తాకార గుడిసెల అవశేషాలు చేయబడ్డాయి. ఇవి 1780 బి.సి. నుండి 1540 B.C. కాలానికి చెందినవని గుర్తించారు.
ఈ కాలంలోనే రాతి బండను తొలిచి గుహలలో ఉండే విధంగా 8 ఇళ్ళను ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో ఒక ఇంటి మధ్యలో కుండలో శిశువు కళేబరాన్ని పెట్టి సమాధి చేయబడింది. కడప జిల్లాలోని పులివెందుల దగ్గర ఇలాంటి ఒక గుహను కనుగొన్నారు. ఆ గుహలో ఆనాటి ప్రజలు నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద గల గండ్లూరు గ్రామంలో కూడా ఇలాంటిది కనిపించింది. ఈ ఆధారాల వల్లనే కొత్త రాతి యుగపు బూడిద దిబ్బలనే పదాన్ని సాహిత్యంలో ఉపయోగించేందుకు దారితీశాయి.
ఈ యుగంలోనే మత విశ్వాసాలు ప్రారంభమయ్యాయి. పురుషాధిక్యత మొదలైంది. రాబర్ట్ బ్రూస్పూట్ ప్రకారం ఈ యుగ కాలంలో మొదటగా 'రాయచూరు'లో 'లింగ ఆరాధన' మొదలైంది. శ్రమ విభజన కూడా జరిగింది.
పురావస్తు శాస్త్రవేత్తలకు రాక్ ఆర్ట్ అనేది చాలా ఉపయోగకరమైనది. వీటి ఆధారంగా అప్పటి ప్రజల సంస్కృతిని, జీవన విధానాన్ని అంచనా వేయగలుగుతారు. ఈ రాక్ ఆర్ట్ రెండు విధాలుగా ఉంటుంది. గుహల్లో బండలపైన ఒక పదునైన రాయితోనో, ఉలితోనో చెక్కిన ఆకారాలు ఒకటి.
వివిధ రంగులతో గీచిన చిత్రాలు మరొకటి. వీటిని బట్టి వాటి కాలాన్ని నిర్ధారించవచ్చు.వీటి ఆధారంగా వైఎస్ఆర్ జిల్లా లో కనుగొన్న రాతి చిత్రాలను క్రీ.ఫూ.8000-1500 కు చెందినవిగా గుర్తించారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముద్దనూరు
మండలం చింతకుంట గ్రామంలో, వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ లో ఐఐఐటి సమీపంలో ఉన్న కొండలపై
ఆది మానవుడు రాళ్ల పై గీచిన రేఖా చిత్రాల గురించి ఆస్ట్రియా పురాతత్వ శాస్త్రవేత్త ఇర్విన్ న్యూ మేయర్” లైన్స్ ఆన్ స్టోన్ ది ప్రి హిస్టారిక్ రాక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా" అనే పుస్తకంలో వీటి గురించి రాసినాడు. చింతకుంటలో మాదిరి దొప్పల్లెలో కూడా ఇలాంటి రేఖా చిత్రాలున్నాయి. అయితే ఆ పల్లె ఇప్పుడు మైలవరం జలాశయంలో మునిగిపోయింది.
దక్షిణ భారతదేశంలోనే మొదటి పెద్దదైన, ప్రముఖమైన మిసోలిథిక్ కాలానికి ( వీటిని 1981లో గుర్తించారు.మన రాష్ట్రంలో మధ్య రాతి యుగం (మిసోలిథిక్), కొత్త రాతి యుగం నాటి రాతి కళా స్థావరాలు చాలాచోట్ల ఉన్నాయి.
ఇవి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, మహబూబ్ నగర్, ప్రకాశం, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్నాయి.
ఆ నాటి మానవుడు చెక్కుచెదరని విధంగా తనకు తెలిసిన నైపుణ్యం తో
రాళ్ల మీద వేసిన బొమ్మలను చూస్తే అచ్చెరువొందుతాము. జింకల బొమ్మలు, మానవాకృతి చిత్రాలున్నాయి. వాటికి శిరోవేష్టనం ఉంది. రేఖలు చెదిరి శరీరభాగం మీద అడ్డదిడ్డంగా ఉన్నాయి. మధ్య శిలాయుగంతోపాటు నవీన శిలాయుగ శిలా చిత్ర లేఖనాలు చింతకుంటలో ఉండటం చాలా అరుదైన విషయం.
విల్లంబులు కలిగి ఉన్న మానవులు మూపురం ఎద్దుల పక్కనే ఉన్నారు. శిలల మీద గంట్లు, గీట్లు పెట్టినట్లు చెక్కడాలు కూడా మూపురం ఎద్దులకే ఎక్కువగా వున్నవి. ఈ మూపురం ఎద్దులకు శైలీపరమైన పోలికలున్న శిలా చిత్రలేఖనాలు భారతదేశంలో ఎక్కడా కానరాలేదని పరిశోధకులు చెపుతున్నారు.
ఈ చిత్రాలు నేలకు 3 నుంచి 5 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అందులో మూపురం ఎద్దులు ఒకే ఒక గుండుపై ఉన్నాయి. ఈ గుండును స్థానిక ప్రజలు ఆవుల గుండు అంటారు. అలాగే మైథున క్రీడలో వున్న దంపతుల చిత్రం కూడా ఉంది. వేంపల్లె సమీపంలో ఉన్న ఇడుపులపాయలో కనిపిస్తున్న చిత్రాలలో
పాడెను(శవాన్ని) నలుగురు మోస్తున్న తీరు, ఆ శవంతో పాటు వెళ్తున్న ప్రజలు కనిపిస్తారు. ఇది ఆనాటి ప్రజలు చేసిన విధానమే ఇప్పటికే కొనసాగుతున్నట్లు మనకు కనిపిస్తుంది.
ఇక్కడే మరో చోట
ఎర్రని రంగుల రేఖా చిత్రాలలో కొన్ని ఏనుగుల బొమ్మలు కూడా వున్నాయి.
ఎథ్నో-ఆర్కియాలజీ:
నియోలిథిక్ ప్రజలు పశుపోషణను మొదటిగా ఆచరించిన ప్రాచీన ప్రజలు. ఈరోజు కూడా గొల్ల, కురుబ అనే రెండు సమకాలీన పశుపోషక తెగల జీవనశైలి, సంస్కృతి అధ్యయనం చేయడం ద్వారా నియోలిథిక్ ప్రజల జీవన విధానాన్ని మనం బాగా అర్థం చేసుకోగలం. నియోలిథిక్ స్థలాల పరిసరాల్లో ఉన్న వ్యవసాయ భూములు పశుపోషక కులమైన గొల్ల కులానికి చెందినవిగా కనిపిస్తున్నాయి. ఈ గొల్లలు ఈ అధ్యయన గ్రామాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఈనాటికీ ప్రభావశీలులుగా ఉన్నారు. ఎందుకంటే వారు వ్యవసాయంతో పాటు పశుపోషణను కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టి, జీవనాధార పద్ధతులు, ఆర్థిక జీవితం, భౌతిక సంస్కృతిని మనం అధ్యయనం చేయడం ద్వారా, వీరు అనుసరించిన జీవన విధానం ఆధారంగా ప్రాచీన ప్రజల జీవన విధానాన్ని పునర్నిర్మించడం సాధ్యపడుతుంది. వారు కూడా వ్యవసాయం, పశుపోషణ, వేట మొదలైనవన్నీ ఆచరించినవారే.
___ పిళ్లా కుమారస్వామి,9490122229
*References* :
An outline of Indian Prehistory__D K Bhattacharya
(ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి__డా. యం. అబ్దుల్ కరీం)
(ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర__
డా॥పి. జోగినాయుడు)
ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి__ సయ్యద్ రాజా
LINES ON STONE : The Prehistoric Rock Art Of India__ERWIN NEUMAYER
Kadapainfo.com
NEOLITHIC EXPLORATIONS KADAPA DISTRICT OF AP: A HISTORICAL SURVEY_Hemamanjari
కడపజిల్లా విజ్ఞాన దీపిక_డా.చింతకుంట శివారెడ్డి
PARIPEX-INDIAN JOURNAL OF RESEARCH | Volume 11
ఇవ్వబడిన పూర్తి విషయాన్ని అర్థం మారకుండా, అకాడమిక్ శైలిలో తెలుగులోకి అనువదిస్తున్నాను. మీరు దీన్ని నేరుగా పేపర్ / థీసిస్ / పుస్తకం కోసం ఉపయోగించుకోవచ్చు.
ఆర్థిక అభివృద్ధిలో మానవ మూలధనపు పాత్ర
(Role of Human Capital in Economic Development)
మానవ వనరులు ఆర్థిక అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన అంశం. ఆర్థిక శాస్త్రవేత్తలు చాలామంది జనాభాను అభివృద్ధికి సహాయకారకంగా కాకుండా, అభివృద్ధికి అడ్డంకిగా చూస్తుంటారు. అయితే, మానవుడు ఆర్థిక వృద్ధికి సానుకూలంగా దోహదపడతాడు. ఉత్పత్తికి అవసరమైన శ్రమశక్తిని మానవుడే అందిస్తాడు. ఒక దేశంలో శ్రమ సమర్థవంతంగా, నైపుణ్యంతో కూడి ఉంటే, ఆ శ్రమ ఆర్థిక వృద్ధికి ఇచ్చే సహకారం అత్యధికంగా ఉంటుంది.
అజ్ఞానం, నైపుణ్యలేమి, రోగగ్రస్త స్థితి, మూఢనమ్మకాలతో బాధపడే ప్రజల ఉత్పాదకత సాధారణంగా తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రజలు దేశ అభివృద్ధి కార్యాచరణకు ఆశాజనకమైన శక్తిగా నిలవలేరు.
“మానవజాతి జీవించి ఉండాలంటే మన ఆలోచనా విధానంలో మౌలికమైన మార్పు అవసరం.”
— ఆల్బర్ట్ ఐన్స్టీన్
ప్రజలను అభివృద్ధి చేయడం అనేది మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాల మూల సారాంశం. అభివృద్ధి ప్రణాళికలు, విధానాలు, కార్యక్రమాలు, కొత్త వ్యవస్థలు, యంత్రాంగాల ఏర్పాటు వంటి అన్ని అభివృద్ధి చర్యలకు మానవాభివృద్ధి ఒక ముఖ్యమైన సాధనంగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ – ప్రాంతీయ నేపథ్యం
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఇది దేశం యొక్క ఆగ్నేయ తీర ప్రాంతంలో ఉంది. రాష్ట్ర విస్తీర్ణం 1,60,205 చదరపు కిలోమీటర్లు. 2011 భారత జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ జనాభా 4,93,86,799గా ఉండి, జనాభా పరంగా దేశంలో 10వ స్థానంలో ఉంది. 972 కిలోమీటర్ల తీరరేఖతో, గుజరాత్ తరువాత రెండవ పొడవైన తీరరేఖ గల రాష్ట్రంగా నిలుస్తుంది.
ఈ రాష్ట్రానికి వాయువ్యంగా తెలంగాణ, ఈశాన్యంలో ఒడిశా, దక్షిణంలో తమిళనాడు, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి:
- తీరాంధ్ర
- రాయలసీమ
మొత్తం 13 జిల్లాలు ఉండగా, వాటిలో 9 జిల్లాలు తీరాంధ్రలో, 4 జిల్లాలు రాయలసీమలో ఉన్నాయి.
రాయలసీమ – మానవ మూలధన పరిస్థితి
రాయలసీమ (అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ అంచున ఉంది. తూర్పున నెల్లూరు జిల్లా, పడమరన కర్ణాటక, ఉత్తరాన తెలంగాణ, దక్షిణాన తమిళనాడు రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి.
2011 జనగణన ప్రకారం, రాయలసీమ నాలుగు జిల్లాల విస్తీర్ణం 67,299 చదరపు కిలోమీటర్లు, జనాభా సుమారు 1.52 కోట్లు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగా మాత్రమే కాకుండా, కరువు ప్రభావిత ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే ఈ అధ్యయనం రాయలసీమలో మానవ మూలధన స్థితి (HDI) ఏ విధంగా ఉందో విశ్లేషిస్తుంది.
మానవాభివృద్ధి భావన
మానవాభివృద్ధి అనేది ప్రజల ఎంపికలను విస్తరించడమే కాకుండా, వారి జీవన స్థాయిని పెంచే ప్రక్రియ. పౌల్ స్ట్రీటెన్ పేర్కొన్నట్లు, మానవాభివృద్ధి భావన ప్రజలను మళ్లీ కేంద్ర బిందువులోకి తీసుకువస్తుంది. సాంకేతిక పదజాలం ఆధిపత్యం చెలాయించిన దశాబ్దాల తరువాత, అభివృద్ధి యొక్క మౌలిక దృష్టిని ఇది తిరిగి స్థాపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో మానవ మూలధన స్థితి
అభివృద్ధి యొక్క కేంద్రబిందువు ప్రజలేననే సత్యాన్ని మేము తిరిగి గుర్తిస్తున్నాము. అభివృద్ధి లక్ష్యం ప్రజలకు మరిన్ని అవకాశాలను అందించడమే. ఆదాయ ప్రాప్తి ఒక ముఖ్యమైన అవకాశం అయినప్పటికీ, అది స్వయంగా లక్ష్యం కాదు; మానవ సౌఖ్యాన్ని పొందడానికి ఒక సాధనం మాత్రమే.
ఇతర ముఖ్యమైన అవకాశాలు కూడా ఉన్నాయి:
- దీర్ఘాయుష్క జీవితం
- జ్ఞానం
- రాజకీయ స్వేచ్ఛ
- వ్యక్తిగత భద్రత
- సమాజంలో భాగస్వామ్యం
- మౌలిక మానవ హక్కుల హామీ
ప్రజలను కేవలం ఆర్థిక జీవులుగా మాత్రమే చూడలేం. అభివృద్ధి ప్రక్రియలో మానవ సామర్థ్యాలు ఎలా విస్తరించబడుతున్నాయో, ఎలా సమర్థవంతంగా వినియోగించబడుతున్నాయో పరిశీలించడం ఎంతో ఆసక్తికరం.
ఆదాయం, అక్షరాస్యత, ఆయుర్దాయం
పట్టిక–1 ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా 2008–09 మరియు 2009–10 సంవత్సరాలలో వ్యక్తిగత ఆదాయాన్ని చూపిస్తుంది. తీరాంధ్రలో విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు మరియు రాయలసీమలో అనంతపురం, వై.ఎస్.ఆర్. కడప జిల్లాలు అత్యధిక వ్యక్తిగత ఆదాయం కలిగి ఉన్నాయి.
శ్రీకాకుళం, విజయనగరం (తీరాంధ్ర) మరియు చిత్తూరు, కర్నూలు (రాయలసీమ) జిల్లాలు అత్యల్ప వ్యక్తిగత ఆదాయం కలిగి ఉన్నాయి. మొత్తం మీద, తీరాంధ్ర సగటు వ్యక్తిగత ఆదాయం రాయలసీమ కంటే ఎక్కువగా ఉంది.
పట్టిక–2 ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీ అక్షరాస్యత రేటును చూపిస్తుంది. గత మూడు దశాబ్దాలలో అక్షరాస్యత పెరిగినప్పటికీ, అది జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగానే ఉంది. 2011 జనగణన ప్రకారం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలు మాత్రమే 70% కంటే ఎక్కువ అక్షరాస్యతను సాధించాయి. వీటిలో రాయలసీమకు చెందిన జిల్లా చిత్తూరు మాత్రమే.
విజయనగరం, కర్నూలు జిల్లాల్లో అక్షరాస్యత అత్యల్పంగా ఉంది. కాబట్టి తీరాంధ్ర సగటు అక్షరాస్యత రాయలసీమ కంటే ఎక్కువగా ఉంది. అక్షరాస్యత మానవాభివృద్ధి సూచిక (HDI)లో అత్యంత ముఖ్యమైన ప్రమాణం. అక్షరాస్యత తక్కువగా ఉండటమే ఆంధ్రప్రదేశ్కు తక్కువ HDI ర్యాంకు రావడానికి ప్రధాన కారణం. కాబట్టి విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అవసరం.
పట్టిక–3 ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ ఆయుర్దాయం (Life Expectancy) వివరాలను చూపిస్తుంది. 1980–81 నుంచి 2005–06 వరకు ఆంధ్రప్రదేశ్లో ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. దాదాపు మూడు దశాబ్దాల కాలంలో ఆయుర్దాయం విషయంలో ఆంధ్రప్రదేశ్ మంచి ప్రగతి సాధించింది.
రాయలసీమలో మానవ మూలధన అభివృద్ధి అవసరం
రాయలసీమ ప్రాంతంలో మానవ మూలధన అభివృద్ధి అత్యంత అవసరం. పోషణ, ఆరోగ్యం, విద్య ద్వారా మానవ మూలధన నిర్మాణం జరగాలి. ఆర్థిక వృద్ధి ఫలితాలు ప్రజల జీవితాల్లోకి చేరాలంటే మానవాభివృద్ధి కీలకం.
“ప్రజల కోసం అభివృద్ధి” అంటే అభివృద్ధి ఫలితాలు ప్రజలకు చేరాలి.
“ప్రజల ద్వారా అభివృద్ధి” అంటే ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రక్రియల్లో వారు భాగస్వాములు కావాలి.
అంటే, అభివృద్ధి ప్రజలకు అనుగుణంగా ఉండాలి; ప్రజలను అభివృద్ధికి అనుగుణంగా మార్చకూడదు.
డా. జి. యెల్లా కృష్ణ
(www.impactjournals.us)
మానవ మూలధనం – ఆరోగ్యం – విద్య – ఆదాయం
మీకు ఇవ్వబడిన పూర్తి విషయాన్ని అర్థం మారకుండా, అకాడమిక్ శైలిలో తెలుగులోకి అనువదిస్తున్నాను. మీరు దీన్ని నేరుగా పేపర్ / థీసిస్ / పుస్తకం కోసం ఉపయోగించుకోవచ్చు.
ఆర్థిక అభివృద్ధిలో మానవ మూలధనపు పాత్ర
(Role of Human Capital in Economic Development)
మానవ వనరులు ఆర్థిక అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన అంశం. ఆర్థిక శాస్త్రవేత్తలు చాలామంది జనాభాను అభివృద్ధికి సహాయకారకంగా కాకుండా, అభివృద్ధికి అడ్డంకిగా చూస్తుంటారు. అయితే, మానవుడు ఆర్థిక వృద్ధికి సానుకూలంగా దోహదపడతాడు. ఉత్పత్తికి అవసరమైన శ్రమశక్తిని మానవుడే అందిస్తాడు. ఒక దేశంలో శ్రమ సమర్థవంతంగా, నైపుణ్యంతో కూడి ఉంటే, ఆ శ్రమ ఆర్థిక వృద్ధికి ఇచ్చే సహకారం అత్యధికంగా ఉంటుంది.
అజ్ఞానం, నైపుణ్యలేమి, రోగగ్రస్త స్థితి, మూఢనమ్మకాలతో బాధపడే ప్రజల ఉత్పాదకత సాధారణంగా తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రజలు దేశ అభివృద్ధి కార్యాచరణకు ఆశాజనకమైన శక్తిగా నిలవలేరు.
“మానవజాతి జీవించి ఉండాలంటే మన ఆలోచనా విధానంలో మౌలికమైన మార్పు అవసరం.”
— ఆల్బర్ట్ ఐన్స్టీన్
ప్రజలను అభివృద్ధి చేయడం అనేది మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాల మూల సారాంశం. అభివృద్ధి ప్రణాళికలు, విధానాలు, కార్యక్రమాలు, కొత్త వ్యవస్థలు, యంత్రాంగాల ఏర్పాటు వంటి అన్ని అభివృద్ధి చర్యలకు మానవాభివృద్ధి ఒక ముఖ్యమైన సాధనంగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ – ప్రాంతీయ నేపథ్యం
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఇది దేశం యొక్క ఆగ్నేయ తీర ప్రాంతంలో ఉంది. రాష్ట్ర విస్తీర్ణం 1,60,205 చదరపు కిలోమీటర్లు. 2011 భారత జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ జనాభా 4,93,86,799గా ఉండి, జనాభా పరంగా దేశంలో 10వ స్థానంలో ఉంది. 972 కిలోమీటర్ల తీరరేఖతో, గుజరాత్ తరువాత రెండవ పొడవైన తీరరేఖ గల రాష్ట్రంగా నిలుస్తుంది.
ఈ రాష్ట్రానికి వాయువ్యంగా తెలంగాణ, ఈశాన్యంలో ఒడిశా, దక్షిణంలో తమిళనాడు, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి:
- తీరాంధ్ర
- రాయలసీమ
మొత్తం 13 జిల్లాలు ఉండగా, వాటిలో 9 జిల్లాలు తీరాంధ్రలో, 4 జిల్లాలు రాయలసీమలో ఉన్నాయి.
రాయలసీమ – మానవాభివృద్ధి సూచికల పరిస్థితి
రాయలసీమ (అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ అంచున ఉంది. తూర్పున నెల్లూరు జిల్లా, పడమరన కర్ణాటక, ఉత్తరాన తెలంగాణ, దక్షిణాన తమిళనాడు రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి.
2011 జనగణన ప్రకారం, రాయలసీమ నాలుగు జిల్లాల విస్తీర్ణం 67,299 చదరపు కిలోమీటర్లు, జనాభా సుమారు 1.52 కోట్లు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగా మాత్రమే కాకుండా, కరువు ప్రభావిత ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే ఈ అధ్యయనం రాయలసీమలో మానవ మూలధన స్థితి (HDI) ఏ విధంగా ఉందో విశ్లేషిస్తుంది.
మానవాభివృద్ధి భావన
మానవాభివృద్ధి అనేది ప్రజల ఎంపికలను విస్తరించడమే కాకుండా, వారి జీవన స్థాయిని పెంచే ప్రక్రియ. పౌల్ స్ట్రీటెన్ పేర్కొన్నట్లు, మానవాభివృద్ధి భావన ప్రజలను మళ్లీ కేంద్ర బిందువులోకి తీసుకువస్తుంది. సాంకేతిక పదజాలం ఆధిపత్యం చెలాయించిన దశాబ్దాల తరువాత, అభివృద్ధి యొక్క మౌలిక దృష్టిని ఇది తిరిగి స్థాపిస్తుంది.
రాయలసీమ లో మానవాభివృద్ధి స్థితి
ప్రజలే అభివృద్ధికి కేంద్రబిందువు. అభివృద్ధి లక్ష్యం ప్రజలకు మరిన్ని అవకాశాలను అందించడమే. ఆదాయ ప్రాప్తి ఒక ముఖ్యమైన అవకాశం అయినప్పటికీ, అది స్వయంగా లక్ష్యం కాదు; మానవ సౌఖ్యాన్ని పొందడానికి ఒక సాధనం మాత్రమే.ఇతర ముఖ్యమైన అవకాశాలు కూడా ఉన్నాయి:
- దీర్ఘాయుష్క జీవితం
- జ్ఞానం
- రాజకీయ స్వేచ్ఛ
- వ్యక్తిగత భద్రత
- సమాజంలో భాగస్వామ్యం
- మౌలిక మానవ హక్కుల హామీ
ప్రజలను కేవలం ఆర్థిక జీవులుగా మాత్రమే చూడలేం. అభివృద్ధి ప్రక్రియలో మానవ సామర్థ్యాలు ఎలా విస్తరించబడుతున్నాయో, ఎలా సమర్థవంతంగా వినియోగించబడుతున్నాయో పరిశీలించడం ఎంతో ఆసక్తికరం.
ఆదాయం, అక్షరాస్యత, ఆయుర్దాయం
పట్టిక–1 ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా 2008–09 మరియు 2009–10 సంవత్సరాలలో వ్యక్తిగత ఆదాయాన్ని చూపిస్తుంది. తీరాంధ్రలో విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు మరియు రాయలసీమలో అనంతపురం, వై.ఎస్.ఆర్. కడప జిల్లాలు అత్యధిక వ్యక్తిగత ఆదాయం కలిగి ఉన్నాయి.
శ్రీకాకుళం, విజయనగరం (తీరాంధ్ర) మరియు చిత్తూరు, కర్నూలు (రాయలసీమ) జిల్లాలు అత్యల్ప వ్యక్తిగత ఆదాయం కలిగి ఉన్నాయి. మొత్తం మీద, తీరాంధ్ర సగటు వ్యక్తిగత ఆదాయం రాయలసీమ కంటే ఎక్కువగా ఉంది.
పట్టిక–2 ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీ అక్షరాస్యత రేటును చూపిస్తుంది. గత మూడు దశాబ్దాలలో అక్షరాస్యత పెరిగినప్పటికీ, అది జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగానే ఉంది. 2011 జనగణన ప్రకారం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలు మాత్రమే 70% కంటే ఎక్కువ అక్షరాస్యతను సాధించాయి. వీటిలో రాయలసీమకు చెందిన జిల్లా చిత్తూరు మాత్రమే.
విజయనగరం, కర్నూలు జిల్లాల్లో అక్షరాస్యత అత్యల్పంగా ఉంది. కాబట్టి తీరాంధ్ర సగటు అక్షరాస్యత రాయలసీమ కంటే ఎక్కువగా ఉంది. అక్షరాస్యత మానవాభివృద్ధి సూచిక (HDI)లో అత్యంత ముఖ్యమైన ప్రమాణం. అక్షరాస్యత తక్కువగా ఉండటమే ఆంధ్రప్రదేశ్కు తక్కువ HDI ర్యాంకు రావడానికి ప్రధాన కారణం. కాబట్టి విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అవసరం.
పట్టిక–3 ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ ఆయుర్దాయం (Life Expectancy) వివరాలను చూపిస్తుంది. 1980–81 నుంచి 2005–06 వరకు ఆంధ్రప్రదేశ్లో ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. దాదాపు మూడు దశాబ్దాల కాలంలో ఆయుర్దాయం విషయంలో ఆంధ్రప్రదేశ్ మంచి ప్రగతి సాధించింది.
రాయలసీమలో మానవ మూలధన అభివృద్ధి అవసరం
రాయలసీమ ప్రాంతంలో మానవ మూలధన అభివృద్ధి అత్యంత అవసరం. పోషణ, ఆరోగ్యం, విద్య ద్వారా మానవ మూలధన నిర్మాణం జరగాలి. ఆర్థిక వృద్ధి ఫలితాలు ప్రజల జీవితాల్లోకి చేరాలంటే మానవాభివృద్ధి కీలకం.
“ప్రజల కోసం అభివృద్ధి” అంటే అభివృద్ధి ఫలితాలు ప్రజలకు చేరాలి.
“ప్రజల ద్వారా అభివృద్ధి” అంటే ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రక్రియల్లో వారు భాగస్వాములు కావాలి.
అంటే, అభివృద్ధి ప్రజలకు అనుగుణంగా ఉండాలి; ప్రజలను అభివృద్ధికి అనుగుణంగా మార్చకూడదు.
డా. జి. యెల్లా కృష్ణ
(www.impactjournals.us)
మానవ మూలధనం – ఆరోగ్యం – విద్య – ఆదాయం
ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ తెగల సామాజిక–ఆర్థిక స్థితి
కడప జిల్లా : ఒక విశ్లేషణ
(Socio-economic Status of Scheduled Tribes in Andhra Pradesh: An Analysis in Kadapa District)
షెడ్యూల్డ్ తెగల సామాజిక–ఆర్థిక స్థితిని అధ్యయనం చేయడానికి **బహుస్థాయి యాదృచ్ఛిక నమూనా పద్ధతి (Multi-stage Random Sampling Technique)**ను ఉపయోగించారు.
మొదటి దశలో, ఈ అధ్యయనం కోసం కడప జిల్లాను ఉద్దేశపూర్వకంగా (purposively) ఎంపిక చేశారు.
రెండవ దశలో, కడప, జమ్మలమడుగు, రాజంపేట అనే మూడు రెవెన్యూ డివిజన్లను ఎంపిక చేశారు.
మూడవ దశలో, ప్రతి డివిజన్ నుండి యాదృచ్ఛికంగా రెండు మండలాలను ఎంపిక చేయగా, అవి రాయచోటి, టి.సుందుపల్లి, నందలూరు, బి.కోడూరు, తొండూరు, వెంపల్లి మండలాలు.
నాలుగవ దశలో, ప్రతి మండలం నుండి యాదృచ్ఛికంగా 25 మంది గిరిజనులను నమూనాగా ఎంపిక చేశారు.
ఈ విధంగా ఎంపికైన నమూనా గ్రామాలలోని అన్ని గిరిజన కుటుంబాలను సిద్ధం చేసిన ప్రశ్నావళి (schedule) సహాయంతో ఇంటర్వ్యూ చేయగా, కడప జిల్లాలో మొత్తం 150 మంది నమూనా ప్రతిస్పందకులు (respondents) ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
జనసాంఖ్యిక లక్షణాలు
అధ్యయన ప్రాంతంలో పురుషులు 59.33 శాతం, మహిళలు 40.66 శాతంగా ఉన్నారు.
వయస్సు పరంగా పరిశీలిస్తే,
- 25–35 సంవత్సరాల వయస్సు గలవారు 39.33 శాతం,
- 35–45 సంవత్సరాల వయస్సు గలవారు 28 శాతం,
- 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారు 12 శాతం,
- 18–25 సంవత్సరాల వయస్సు గలవారు 20.66 శాతంగా ఉన్నారు.
విద్యా స్థాయి
విద్యా స్థాయి పరంగా చూస్తే,
- 36.66 శాతం నిరక్షరాస్యులు,
- 46 శాతం ప్రాథమిక విద్య,
- 12 శాతం ద్వితీయ విద్య,
- 5.33 శాతం ఇంటర్మీడియట్ స్థాయి విద్య కలిగి ఉన్నారు.
వైవాహిక స్థితి
వైవాహిక స్థితిని పరిశీలిస్తే,
- 115 మంది (76.66 శాతం) వివాహితులు,
- 16 శాతం అవివాహితులుగా ఉన్నారు.
నివాస పరిస్థితులు
నివాస గృహాల వివరాలు ఇలా ఉన్నాయి:
- 16.66 శాతం మంది కచ్చా ఇళ్లలో,
- 27.33 శాతం మంది పక్కా ఇళ్లలో,
- 50.66 శాతం మంది మిశ్రమ (కచ్చా + పక్కా) ఇళ్లలో,
- 5.33 శాతం మంది గుడిసెల్లో నివసిస్తున్నారు.
పశుసంపద
అధ్యయన ప్రాంతంలో పశుసంపద పంపిణీ ఈ విధంగా ఉంది:
- ఎద్దులు – 5.33 శాతం,
- ఆవులు – 8 శాతం,
- గేదెలు – 17.33 శాతం,
- గొర్రెలు, మేకలు – 69.33 శాతం.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం
షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, ఏ పథకం ఎంతవరకు ప్రజలకు చేరుతుందో (outreach) తెలుసుకోవడం అత్యంత అవసరం.
ఈ అధ్యయన ఫలితాల ప్రకారం:
- ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ (FFW),
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS),
- ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం
ఈ మూడు పథకాలు విజయవంతంగా అమలయ్యాయి. మొత్తం నమూనా ప్రతిస్పందకులందరూ ఈ మూడు పథకాల లబ్ధిదారులే.
అయితే, ఇందిరమ్మ పథకం ద్వారా పూర్తిగా లబ్ధి పొందిన వారు కేవలం 60.66 శాతం మాత్రమే, మిగతావారు లబ్ధికి దూరమయ్యారు. అందువల్ల, గిరిజనుల ఆదాయ స్థితి వారికి సరైన సామాజిక భద్రత లేదా జీవన ప్రమాణాన్ని అందించడం లేదు. వారు ఇంకా ప్రభుత్వ గృహ పథకాలపై ఆధారపడాల్సి వస్తోంది. కాబట్టి ఈ పథకాల అమలులో ప్రభుత్వం మరింత వినూత్నంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
భూమి స్వామ్యత
భూమి కల్పన పరంగా చూస్తే:
- 12 శాతం భూమిలేని వారు,
- 55.33 శాతం ఒక ఎకరం కంటే తక్కువ భూమి కలిగిన వారు,
- 28.66 శాతం 1–2 ఎకరాల భూమి కలిగిన వారు,
- 4 శాతం రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారుగా ఉన్నారు.
వృత్తులు
వృత్తుల పంపిణీ ఇలా ఉంది:
- వ్యవసాయదారులు – 12 శాతం,
- కూలీలు – 15.33 శాతం,
- గృహ పనులు చేసే వారు – 9.33 శాతం,
- అటవీ ఉత్పత్తుల సేకరణ – 21.33 శాతం,
- వ్యవసాయం కాని కూలీలు – 38 శాతం,
- ఇతర వృత్తులు – 4 శాతం.
ఆదాయం మరియు వ్యయం
ఆదాయ స్థాయిలు:
- రూ.10,000 వరకు – 5.33 శాతం,
- రూ.10,000–20,000 – 35.33 శాతం,
- రూ.20,000–30,000 – 43.33 శాతం,
- రూ.30,000–40,000 – 8 శాతం,
- రూ.40,000–50,000 – 6 శాతం,
- రూ.50,000 పైగా – 2 శాతం.
వ్యయ స్థాయిలు:
- రూ.10,000 వరకు – 2.66 శాతం,
- రూ.10,000–20,000 – 5.33 శాతం,
- రూ.20,000–30,000 – 30 శాతం,
- రూ.30,000–40,000 – 39.33 శాతం,
- రూ.40,000–50,000 – 18.66 శాతం,
- రూ.50,000 పైగా – 4 శాతం.
రుణభారం (Indebtedness)
నమూనా ప్రతిస్పందకుల ఆదాయం తక్కువగా ఉండటం, ఖర్చులకు సరిపోకపోవడం వల్ల వారు తరచుగా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా, ఆర్థిక సంస్థలు సులభంగా అందుబాటులో లేకపోవడం వల్ల వారు వడ్డీ వ్యాపారులను (money lenders) ఆశ్రయిస్తున్నారు.
వడ్డీ వ్యాపారులు మరియు భూస్వాములు 24 నుంచి 60 శాతం వరకు అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నారు.
ఇతరవైపు, సహకార బ్యాంకులు 1–14 శాతం, వాణిజ్య బ్యాంకులు మరియు గ్రామీణ బ్యాంకులు 4–11 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నాయి.
రుణాల మూలాలు
రుణాల మూలాలు ఈ విధంగా ఉన్నాయి:
- వాణిజ్య బ్యాంకులు – 1.33 శాతం,
- ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు – 5.33 శాతం,
- సహకార బ్యాంకులు – 7.33 శాతం,
- భూస్వాములు – 19.33 శాతం,
- వడ్డీ వ్యాపారులు – 16.66 శాతం,
- పొరుగువారు – 25.33 శాతం,
- స్నేహితులు, బంధువులు – 14 శాతం,
- గ్రామ వ్యాపారులు – 10.66 శాతం.
గిరిజనుల రుణ అవసరాల్లో ఎక్కువ భాగం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ద్వారా నెరవేరుతోంది. అధిక వడ్డీ రేట్లు వారి జీవితాలను మరింత అసురక్షితంగా మారుస్తున్నాయి.
సూచనలు మరియు ముగింపు
షెడ్యూల్డ్ తెగల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం మరింత సృజనాత్మకంగా చర్యలు తీసుకోవాలి. తక్కువ వడ్డీ రేట్లతో సరిపడా రుణాలు అందిస్తూ బ్యాంకింగ్ సేవలను విస్తరించాలి. వ్యక్తి స్థాయిలో ఆర్థిక అభివృద్ధి జరిగితే, అది సమాజం మరియు గ్రామీణ సముదాయ అభివృద్ధికి దోహదపడుతుంది.
మనందరికీ తెలిసినట్లుగా, అభివృద్ధి గ్రామాల నుంచే ప్రారంభమవుతుంది. అటవీ ఆధారిత ఉత్పత్తులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెటింగ్ సౌకర్యాలు, గోదాములు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలను విస్తృతంగా అందించాలి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి