గంజికరువు పై కావ్యం
ఆధునిక సాహిత్యంలో 1952 నాటి గంజి కరువును గురించి బెళ్లూరి శ్రీనివాసమూర్తి తన ' తపోవనం ' కావ్యంలో ఇలా ప్రస్తావించారు .
" కనుడోయీ ఇటు గంజికేంద్ర మిటులాకర్ణింపు దాక్రందన
ధ్వనిహస్తంబుల మట్టి పాత్రలు వహియింపన్ ధీనభావంబు లా నన సీమన్ వహియింపగా ముసుచున్నారెంత దారిద్ర్య మీ
జనతన్ మ్రింగగ వేచి యున్నయది దుష్కాలంబుప్రాప్తింపగన్ "
“ ముదుసళ్లు , స్త్రీలు , పురుషులు
పెదవులు తడియారు చంటి బిడ్డలు , మెయి
పయ్యెదలేమి సిగ్గు మరచిన
సుదతులు గలరిందు , క్షుదకు సోలి నడచుచున్ "
గంజి కరువుపై బెళ్లూరి శ్రీనివాసమూర్తి ఒక ఖండికను మాత్రమే రాయగా కడప జిల్లా సుండుపల్లె ప్రాంతానికి చెందిన భైరపురెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి రాయలసీమ ' రైతు ' అనే కావ్యాన్నే రాశారు .
“ కసవు పొసగదు నీరైన నొసగ లేక
మేప నడవికి తోలిన గోపవరుల
కనుగొలంకుల జొచ్చిన కరుణ జలము
గ్రోల గనజూచి నట్లుండె గోచయంబు "
“ జలము తొలగిన పచ్చిక నెలవులకట
నీరు తొరగిన పిన్న యెడారుల వలె
గడ్డి పోచయు లేనట్టి కాడులగుట
నవసి పశుకోటి చావని శవములయ్యె "
అంటూ గంజి కరువునాటి హృదయవిదారక పరిస్థితులను వర్ణించారు .
(సేకరణ:పిళ్లా విజయ్)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి