వైఎస్ఆర్ కడపజిల్లా
| జనాభా లెక్కలు |
2011 భారత జన గణన ప్రకారం జిల్లా జనాభా 28,84,524 మగవారు 1454136, ఆడవారు 1430388. జనసాంద్రత 188/కి.మీ².
2001 జనగణన ప్రకారం అక్షరాస్యత 67.88% కాగా మగవారిలో 78.41%, ఆడవారిలో 57.26%గా ఉంది.
జిల్లా చరిత్ర
కడప జిల్లాచరిత్ర చాలా ప్రాచీనమైంది.
మన్రో ఈ ప్రాంతపు దేవాలయాల అభివృద్ధికి మడిమాన్యాలిచ్చాడు. సి.పి.బ్రౌన్ తెలుగు భాషను సముద్ధరించాడు. మనుచరిత్ర, వసుచరిత్ర వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు. మూడు వేలకు పైగా వేమన పద్యాలను సేకరించాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయించాడు. ఇక కోలిన్ మెకంజీ గ్రామాల చరిత్రను సేకరించి కైఫీయతుల పేరుతో భద్రపరిచాడు.
2010 జూలై 8 నుండి ఈ జిల్లా పేరును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్ కడప జిల్లాగా మార్చింది. తరువాత వైఎస్ ఆర్ జిల్లా గా మార్చారు. 2022 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాను విభజించి కొంత భాగంతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు.
రాయలసీమలోని ఎనిమిది జిల్లాలకు నడిబొడ్డైన కడపలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి.
భౌగోళిక స్వరూపం
- వాతావరణం
అడవులు
ఉష్ణోగ్రతలు వేసవికాలంలో 30°సె. - 44°సె, చలికాలంలో 21°సె. - 30°సెగా వుంటాయి. సగటు వర్షపాతము: 695 మి.మీ.
అడవుల విస్తీర్ణం 4,96,672 హెక్టార్లు, జిల్లా విస్తీర్ణంలో 32.3 శాతం అన్నమాట.పులివెందుల మండలంలో తప్ప నల్లచేవ, ఎర్రచేవ,ఎపి మొదలైన కలప జాతులు, విదేశీమారకం తెచ్చిపెట్టే ఎర్రచందనము లభ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా ఆంతరించి పోయిందనుకున్న కలివికోడి ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది. సింహాలు, చిరుతపులులు, మెదలయిన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి.
వాతావరణం, వర్షపాతం
ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది. శీతాకాలంలో, వేసవిలో కంటే కడప లో చాలా తక్కువ వర్షపాతం ఉంది. కడప లో సగటు వార్షిక ఉష్ణోగ్రత 29.2 ° సెంటీగ్రేడ్.
- జలవనరులు
- జిల్లాలో ప్రధాన నదులు పెన్నా, చిత్రావతి,పాపాఘ్ని, సగిలేరు, బాహుదా , చెయ్యేరు ఉన్నాయి.
తుంగభద్ర నది మీద సుంకేశుల ఆనకట్ట వద్ద మొదలై "కర్నూలు కడప కాలువ"(కెసి కెనాల్) కడప, కర్నూలు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ నాలుగు వేల హెక్టార్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తుంది. సాగునీటి పారుదల కొరకు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, పులివెందల కాలువ నిర్మాణంలో ఉన్నాయి. బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామం వద్ద పుల్లల మడుగు జలాశ్రయం నిర్మించబడింది. గాలేరు-నగరి సుజల స్రవంతి కాలువ, జిల్లాలో త్రాగునీటికి ముఖ్య ఆధారము.
జిల్లా లోపల అనేక జలాశయాలున్నాయి. వాటిలో కొన్ని బ్రహ్మంసాగర్ రిజర్వాయర్, మైలవరం ఆనకట్ట జలాశయం గండికోట రిజర్వాయర్ ఉన్నాయి.
ఆర్ధిక స్థితిగతులు
వ్యవసాయం
వరి, సజ్జ, జొన్న, రాగి వంటి ఆహార ధాన్యాలు, మామిడి, చీనీ, బొప్పాయి వంటి పండ్ల తోటలు, చెఱకు, పసుపు వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. చెన్నూరు తమలపాకులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మైదుకూరు ప్రాంతంలో పండే కె.పి.ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుంది. కృష్ణాపురం గ్రామం పేరు మీదుగా ఆ వంగడానికి ఆ పేరు వచ్చింది.
జిల్లాలో పెన్నానది, కె.సి.కాలువ ప్రధానమైన నీటి వనరులు. జిల్లా మొత్తంలో కాలువల క్రింద 24 వేల హెక్టార్లు, చెరువుల క్రింద 22 వేల హెక్టార్లు, బావుల క్రింద 66 వేల హెక్టార్లు తక్కిన వనరుల క్రింద 11 వేల హెక్టార్లు సాగులో ఉన్నాయి.ఊటుకూరులో వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, అనంత రాజపేటలో పండ్ల పరిశోధన కేంద్రం, మైదుకూరులో జాతీయ ఉద్యనవనాల పరిశోధనాభివృద్ధి సంస్థ ఉన్నాయి.
ఖనిజాలు-పరిశ్రమలు
వైఎస్ఆర్ జిల్లా బెరైటీస్ (ముగ్గురాయి) గనులు, బండలకు ప్రసిద్ధి చెందింది.ప్రపంచంలో మరెక్కడా లభించనంత ముగ్గురాయి (బెరైటీస్) మంగంపేట గనుల్లో లభిస్తోంది.
పులివెందుల ప్రాంతంలో రాతినార తీస్తున్నారు.నాప రాళ్ళకు కడప పెట్టింది పేరు. పులివెందుల నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలను కనుగొన్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం శుద్ధి కర్మాగారం ఉంది. యర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ, విస్తరిస్తోంది. జమ్మలమడుగులో జిందాల్ వారి ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఉంది. ముద్దనూరు దగ్గర ఏర్పాటైన ఆర్.టి.పి.పి. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు మెగాపవర్ ప్రాజెక్టు,కడప ప్రొద్దుటూరులో పారిశ్రామిక వాడలున్నాయి. రాయలసీమ అభివృద్ధి పథకం కింద కడపలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ నెలకొల్పడం జరిగింది.
డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు
రెవిన్యూ డివిజన్లు, మండలాలు
- రెవెన్యూ డివిజన్లు (4): కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు
మండలాలు
- మండలాలు (36). జిల్లా పునర్వ్యవస్థీకరణ తర్వాత పులివెందుల రెవిన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేశారు.
- రెవెన్యూ డివిజన్లు (3): కడప, రాజంపేట, జమ్మలమడుగు
- లోక్సభ స్థానాలు (2) కడప, రాజంపేట
- శాసనసభ స్థానాలు (11): కడప, కమలాపురం, కోడూరు, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, రాజంపేట, రాయచోటి.
- కడప రెవెన్యూ డివిజన్
- జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్
- పులివెందుల రెవెన్యూ డివిజన్
- బద్వేలు రెవెన్యూ డివిజన్
రవాణా సౌకర్యాలు విమానాశ్రయం |
బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం 1990 దశకంలో మూతపడింది. 2014 లో దీనిని ప్రారంభించారు.
రైలు మార్గం
దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటిగా 1854-1866 మధ్య కాలంలో వేయబడిన ముంబై-చెన్నై రైలు మార్గం ఈ జిల్లాలో ఉన్న ఏకైక రైలు మార్గం. రైల్వే కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, రైల్వే కోడూరు ఈ జిల్లాలో ఈ రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు. ముఖ్య వాణిజ్య పట్టణమైన ప్రొద్దుటూరు మీదుగా ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం నిర్మాణ దశలో ఉంది. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలు మార్గాలు వెయ్యాలనే ప్రతి పాదనలు ఉన్నాయి.
రహదారులు
కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కడప-చెన్నై, కడప-బెంగుళూరు రాష్ట్ర రహదారులు. నెల్లూరు-బళ్ళారిలను కలిపే మరో ముఖ్యమైన రహదారి మైదుకూరు మీదుగా వెళ్తుంది.
పశు పక్ష్యాదులు
లంకమల్లేశ్వరములో శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయం, రాజంపేటలో శ్రీ వేంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయం ఉన్నాయి.
విద్యా సంస్థలు
| గ్రంథాలయాలు |
కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం, రిమ్స్ (రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్య కళాశాల ముఖ్యమైనవి. ఇవి కాక పులివెందులలో జె.ఎన్.టీ.యూ (జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం) ఇంజినీరింగ్ కళాశాల, కడపలో క్రీడా పాఠశాల, ప్రభుత్వ హోమియో కళాశాల ఉన్నాయి. ఇక కడపలో సి.పి.బ్రౌన్ నివసించిన బంగళాలో ఆయన పేరిట నెలకొల్పిన బ్రౌన్ గ్రంథాలయం ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా భాషా సాహిత్య పరిశోధనా కేంద్రంగా పనిచేస్తోంది.
పర్యాటకం
ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి.రాజులు, రాజ్యాలు అంతరించినా ఆనాటి చరిత్రకు గుర్తులుగా చాంద్ పీరా గుంబద్, గండికోట దుర్గం, గండికోట, సిద్ధవటం కోట, ఒంటిమిట్ట, తాళ్ళపాక ఉన్నాయి. భగవాన్ మహావీర్ పేరుతో ప్రభుత్వ మ్యూజియం కడప కలెక్టర్ ఆఫీసు ప్రాంగణంలో ఉంది.
- దేవుని కడప,
- బ్రహ్మంగారిమఠం,
- పుష్పగిరి,
- నాగేశులకొండ,
- సిద్దయ్య స్వామి మఠం,
- దుంపలగట్టు,
- ఆస్తాన్-ఎ-మగ్దూమ్ ఇలాహి (పెద్ద దర్గా),
- ఆస్తాన్-ఎ-షామీరియా (షామీరియా దర్గా),
- సెయింట్ మేరీ కేథడ్రాల్
- పుష్పగిరి,
- గండి క్షేత్రం,
- శ్రీ కోదండ రామస్వామి దేవాలయము (ఒంటిమిట్ట),
- నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం
- దానవులపాడు,
- జమ్మలమడుగు,
- ప్రొద్దుటూరు దేవాలయాలు, కందిమల్లాయపల్లెలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం
- శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
ఇవే కాక మస్జీద్-ఏ-ఆజమ్, గండి ఆంజనేయస్వామి దేవాలయము, వేంపల్లె, నామాలగుండు, కనంపల్లెదేవరరాయి, సంబేపల్లి, వీరభద్ర స్వామి దేవాలయము, దేవళాలు (అల్లాడుపల్లె), చాపాడు మండలం, రాచవేటి వీరభద్ర స్వామి దేవాలయము, సంజీవరాయుడు దేవాలయము ప్రొద్దుటూరు మొదలైనవి ఉన్నాయి.
ప్రకృతి రమణీయాలైన కొండలు, కోనలు, చందన వృక్షాలు, వన్యమృగాలు ఈ జిల్లాలో ఉన్నాయి.
ప్రముఖ వ్యక్తులు
పెద్దన
వేమన
రాజకీయనాయకులు
వై ఎస్ రాజశేఖరరెడ్డి
మైసూరా రెడ్డి
యం.వి.రమణారెడ్డి
వై ఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రసార సాధనాలు
1963 జూన్ 16న కడపలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడి నుంచి ప్రసారాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లోని రాయచూరు, బళ్ళారి, బెంగుళూరు, కోలారు, చెన్నై తదితర ప్రాంతాల్లోనే కాక 900 కి.మీ. పరిధిలోని తెలుగు ప్రజలకు అందుతున్నాయి. ఇది కాక కడపలో దూరదర్శన్ రిలే కేంద్రం ఉంది.
మాధవరం చేనేత పరిశ్రమ జిల్లాకు ఆదాయం తెచ్చిపెట్టే ఒక ముఖ్య ఆధారం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి