రేనాటి చోళులే రాయలసీమ నేలిన ప్రథమ రాజులు

 రేనాటి చోళులే రాయలసీమ నేలిన ప్రథమ రాజులు


రేనాడు అని వ్యవహరింపబడిన 
       నేటి వైఎస్ఆర్ నాటి కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు, నాటి చిత్తూరు జిల్లా నేటి రాయచోటి జిల్లాలోని మదనపల్లి, వాయల్పాడు తాలూకాలను కలిపి రేపాడు అని పిలిచేవారు.ఈ రేనాటి సీమను ధనుంజయుడు పాలించినట్లు శాసనాలు లభించాయి.మొదట రేనాటి సీమ 7,000 గ్రామాల పరిధిలో ఉండింది. 
      మొట్ట మొదట తెలుగుభాషలో శాసనాలు వేయించిన కీర్తి రేనాటిచోళులకే దక్కింది.
      రేనాటి ధనుంజయుడి తొలి రాజధాని ఎరికల్‌ అయి ఉండొచ్చునని లభించిన శిలాశాసనాల ద్వారా పరిశోధకులు నిర్ధారించారు.ఈ రేనాటి చోళులు కడప జిల్లా వాసులేనని భావిస్తున్నారు. ఇతను తొలుత 
ఎరికల్‌ అంటే నేటి ఎర్రగుడిని రాజధానిగా చేసుకుని పరిపాలించి ఉండొచ్చునని శిలాశాసనాల ఆధారంగా భావిస్తున్నారు.
 ఎరికల్‌ పదం కాలక్రమేణా ఎరికల్లు, ఎరిగల్లు, ఎరికాల్వ, ఎరిగల్‌గా రూపాంతరం చెంది ఎర్రగుడి (ఎర్రని ఇటుకలతో నిర్మించిన పాత గుడి)గా మారిందని తెలిపారు. ఎర్రగుడి ప్రస్తుతం కమలాపురంలో ఉంది. 7వ శతాబ్దంలో పర్యటించిన హుఎన్ చాంగ్ ప్రస్తావించిన చుళియ రాజ్యమే రేనాటి చోళుల రాజ్యమని చరిత్రకారుల అభిప్రాయం. 
       రేనాటి చోళులు కర్ణాటకలోని నిడుగల్‌ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారన్న గత అంచనాలకు భిన్నంగా తాజా శాసనాలు సూచిస్తున్నాయని పరిశోధక విద్యార్థి నాగదాసరి మునికుమార్‌ తెలిపారు. కడప జిల్లా సిద్దవటం శివారులోని లంకమల అభయారణ్యంలోని ఇష్టకామేశ్వర నిత్యపూజస్వామి కోవెల పరిసరాల్లో లభ్యమైన శిలాశాసనాలను ఎపీగ్రఫీ డైరెక్టర్‌ మునిరత్నంరెడ్డి ఇటీవల అధ్యయనం చేశారు. ఆయన బెంగళూరులోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ కళా కేంద్రంలో తాళపత్ర లిపిశాస్త్రంలో పరిశోధనలు చేస్తున్నారు. 1500 ఏళ్ల కిందట వెలసిన నిత్యపూజకోన చరిత్రను అధ్యయనం చేస్తూ రెండేళ్ల క్రితం సమీపంలోని పంచలింగాల గుడి పక్కన ఉన్న కొండపై నాలుగు పురాతన శాసనాలను గుర్తించారు. వీటిని మైసూరులోని భారత పురావస్తు శాఖ ఏపీగ్రఫీ అధికారులు తీసుకెళ్లి పరిశీలిస్తున్నారు.

        నిత్యపూజస్వామికోనలో లభ్యమైన శాసనాలను భారత పురావస్తు శాఖ ఎపీగ్రఫీ అధికారులు 1810లో ముద్రించిన మద్రాసు గెజిట్‌లోని చరిత్ర అంశాలతో పోల్చి చూశారు. రెండు శాసనాల్లో లభించిన ఆధారాల ప్రకారం ఎరిగల్‌ దళపతి నరసింగుడు నిత్యపూజకోనకు అనుసంధానంగా పంచలింగాల గుడి నిర్మించాడు. 
     ఎరికల్‌ ముత్తురాజు, రేనాటి ధనుంజయుడు జిల్లాలోని పెద్దచెప్పలి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు.ఇతని సేనానిగా పద్మనాథజియ వ్యవహరించినట్లు తెలుస్తోంది. క్రీ.శ.7 శతాబ్దంలో సిద్దవటంపై ఆధిపత్యం కోసం బాణులు నిత్యపూజకోనలో రేనాటి చోళులపై యుద్ధానికి వచ్చారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి