పోతరాజు పార్థసారథి


పోతరాజు పార్థసారథి

       ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరులో 1916 జులై 1న జన్మించారు. తండ్రి గంగిచెట్టి. ఇతను జర్నలిస్టు. 1930 శాసనోల్లంఘన రోజుల్లోనే చదువు మానివేశారు. అటవీ సత్యాగ్రహ కాలంలో ఇతనిపై లాఠీ ఛార్జ్ చేసారు. 8-1-1941 నుండి 8 నెలల జైలు శిక్షను అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అంతకుముందు వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. మద్రాసులో విద్యార్థులను కళాశాలనుబాయ్కాట్ చేయవలసిందిగా కోరారు. 18-2-1943 నుండి ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు. యూరప్, అమెరికా, కెనడాలకు స్టడీ టూర్ పై వెళ్లారు.

       రవీంద్రనాథ ఠాగూర్ గీతాంజలిని ,గార్డనర్' “కాళీదాస్ కృతి” "కుమార సంభవం" గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.  షేక్స్పియర్
సొనెట్ లను కూడా అనువదించారు. క్రీడలు   టెన్నిస్ అంటే అతని కెంతో ఇష్టం.

1935 నుండి 38 వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన అధ్యక్షులు.గా ఉన్నారు. ఇతని సేవలను గమనించి ఎ.ఐ.సి.సి. సభ్యులుగా ఎంపికయ్యారు. డిసెంబర్ 1953 నుండి జూన్ 1955 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎ.సి.సి.సి. కార్యదర్శుల్లో ఒకరు.
       1955 నుండి 1961 వరకు శాసన సభ్యులు. 1967లో  రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి 4వ లోక్‌సభ సభ్యులు గా ఎన్నికయ్యారు.పార్థసారథి రాజంపేట నుంచి 5, 6, 7వ లోక్‌సభకు కూడా వరుసగా ఎన్నికయ్యారు .1970-71లో కేంద్రమంత్రి వర్గ పార్లమెంటరీ వ్యవహారాల ఉపమంత్రి. 1971లో మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు వీరిని లోక్ సభ కు ఎన్నుకున్నారు.

      UN జనరల్ అసెంబ్లీకి ప్రతినిధిగా, 1974; 1970లో ఢిల్లీ, కాన్‌బెర్రాలో జరిగిన ఇంటర్-పార్లమెంటరీ సమావేశాలకు, కైరోలో జరిగిన ప్రపంచ పార్లమెంటేరియన్ల సమావేశానికి హాజరయ్యారు.

___ పిళ్లా కుమారస్వామి,9490122229
(ఆధారం :రాయలసీమ స్వాతంత్ర సమర చరిత్ర,, వికీపీడియా,datais.info )

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

The unexplored relics of Rayalaseema

కదిరి