పోస్ట్‌లు

వేమన గొప్ప హేతువాదం, హేతుబద్ధత.

————————————————————————————— వేమనను కేవలం శతక కర్తగానే చూపించి ఆయన స్థాయిని తగ్గించారు. ఇదే వేమన వేరే దేశంలో ఉండిఉంటే గొప్ప తత్వవేత్తగా గుర్తింపు పొందేవాడు. లేదా బ్రాహ్మణ కులంలో జన్మించి ఉంటే గొప్ప సంస్కర్తగా కొనియాడబడేవాడు.. 1. మతాలు మంచే చెబుతుండవచ్చు  కానీ మతబోధకులు దొంగలంటాడు వేమన.  ఆరు మతములందు నధికమైన మతంబు లింగమతము కన్న లేదు భువిని లింగదార్ల కన్నా దొంగలు లేరయా విశ్వదాభిరామ వినుర వేమ. మతము వేషధార్లు మహిమీద పదివేలు. మూఢజనుల గలప మూగుచుండ్రు  కొంగలు గుమికూడి కొరకవా బోదెలు  విశ్వదాభిరామ వినుర వేమ.  2.  ఆత్మశుద్ది ముఖ్యం కానీ పూజలు ముఖ్యం కాదంటాడు... ఆత్మశుద్ది లేని ఆచార మదియేల  భాండ శుద్దిలేని పాకమేల  చిత్తశుద్ధి లేని శివపూజలేరా  విశ్వదాభిరామ వినుర వేమ  3.  పిండములను పెట్టడం గురించి.... పిండములను జేసి పితరుల తలబోసి  కాకులకు పెట్టు గాడ్దెలారా  పియ్యి తినెడు కాకి పితరుడెట్లాయెరా  విశ్వదాభిరామ వినుర వేమ.  4. జీవులను చంపి మనిషి అనే జీవి తింటే ఒళ్ళు వస్తుంది కానీ మోక్షం ఎలా వస్తుంది అంటాడు మరో పద్యంలో.. జీవి జీవి చ...

రాయలసీమ సామెతలు

సామెతలు  లేదా   లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.  "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు"  అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి మనసుంటే మార్గముంటుంది అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి ఊరక రారు మహానుభావులు అంతా మావాళ్లేగాని అన్నానికి రమ్మనేవాళ్లు లేరు ! ఇంట్లో దేవుణ్ణి వదిలి వీధిలో దేవుణ్ణి మొక్కినట్లు ఎక్కడి నీరూ పల్లానికే చేరుతుంది కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు సిగ్గులేని వాడికి నవ్వే సింగారం ! మన దీపమని ముద్దాడితే మూతి కాలకుండా వుంటుందా ! అన్నానికి ముందు వ్యవహారానికి వెనుక నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు పోరాని చోట్లకు పోతే రారాని మ...

మద్యాన్ని మానిపించే పాండురంగ మాల

చిత్రం
మద్యం అలవాటుకు బానిసలైన వారిని ఆ బారి నుండి తప్పించే దైవం మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. అనంతపురం జిల్లా, రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో గల ఉంతకల్లు గ్రామంలో కొలువైన ఆ పాండురంగ స్వామే మద్యాన్ని మానిపించే దేవుడు. రాయదుర్గ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడి నుండి ఆటోలో ఎక్కి సమీపాన ఉన్న ఉంటకళ్ (ఉంతకల్లు) పాండురంగ స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. బళ్లారి నుండి వచ్చేవారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గం వరకు చేరుకొని, అక్కడి నుండి ఉంటకళ్ దేవాలయానికి వెళ్ళవచ్చు.ఉం ఉంతకల్లుో కొలువైన పాండురంగ దేవాలయం ఎంతో మహిమకలది. గ్రామస్తులందరూ భక్తి శ్రద్దలతో పూజా కార్యాక్రమాలను నిర్వహిస్తుంటారు.  ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పాండురంగ స్వామి దేవాలయాన్ని భక్తుల దర్శనార్థం తెరిచే ఉంచుతారు కొన్ని శతాబ్దాల క్రితం ఈ ఊరు ప్రజలు తరచూ మహారాష్ట్ర లోని పుణ్యక్షేత్రమైన 'పండరీపురం' వెళ్లివచ్చేవారు. ఆతర్వాత ఇక్కడే ఒక దేవాలయాన్ని నిర్మించుకొని పాండురంగ స్వామి దేవాలయం గా పేరుపెట్టుకున్నారు. మద్యానికి బానిసైనవారు ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించి పాండురంగ మాల ధరిస్తే మళ్ళి జన్మలో దాని జోలికి పొరన...

యక్షగానం

చిత్రం
యక్షగానం        యక్షగానంలో కొందరు పాడుతుంటారు.ఆ పాటకు అనుకూలంగా మరి కొందరు ఆడతారు.కథను నడిపే విధానం ముచ్చటగా ఉంటుంది. తోలుబొమ్మలాలు కూడా యింతే. కథను పాటగా పాడుతుంటారు; మాటలు చెపుతూ నడుపుతారు. పాత్రలకు ప్రత్యేక పాటలుంటాయి. తేడా అల్లా ఒక విషయంలోనే ఉంటుంది. యక్షగానంలో మనుషులు ఆడతారు. తోలు బొమ్మలాటలో బొమ్మలను ఆడిస్తారు. రెంటినీ పోల్చి చూచినపుడు చివర చెప్పే విధానం ఒకటి గానే ఉంటుంది. ఈనాడు జక్కుల వారు చేసేనృత్యాలు కన్పించవు. ఈ జక్కుల వారు యక్షగానాలు  ఆడుతున్నారు. 'జక్కులవారి కులదేవతలు అక్కదేవతలు. అక్కదేవతలకొండ పేరుతో పిలవబడే పర్వతం అనంతపురం జిల్లాలో ఉంది. అందువలన ఈ విద్య రాయలసీమలోనే ప్రారంభమైందని పండితులు చెపుతారు.” రాయలసీమలోని అనంతపురం జిల్లాలోజక్కుల వారి కులదేవతైన అక్కదేవతల కొండ వుండడాన్ని బట్టి యక్షగానానికిది మూలమని చెప్పవచ్చు. ఈ నాటికీ గుంటూరు గోదావరి  ​ జిల్లాలో వున్న జక్కులవారు కళావంతుల కోవకు చెంది అభినయ కళలో ప్రావీణ్యం సంపాదించారు.       జక్కుల వారు ఇక్కడ నుండి బయలుదేరి దక్షిణ దేశమంతాసంచారం చేశారు. వీరి ద్వారా యీ విద్య పలు ప్రాంత...

కడపజిల్లా గతవైభవాల కలికితురాయి-గండికోట

*కడపజిల్లా గతవైభవాల కలికితురాయి-గండికోట*           - డా.కోడూరు ప్రభాకరరెడ్డి              కడపజిల్లాలోని జమ్మలమడుగుకు 10 కిలోమీటర్ల దూరాన ఉన్న ప్రసిద్ధ గిరిదుర్గం *గండికోట.* పినాకిని(పెన్నానది) గండికి కుడివైపున సముద్రమట్టానికి 1670 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపైన ఈ కోటను నిర్మించారు.ఇక్కడ పెన్నానది 5 కిలోమీటర్ల మేర గండి కోసి లోతైన ప్రవాహంగా దుర్గానికి పెట్టని కందకంగా ఉండటం వల్ల  ఈ కోట శత్రుదుర్భేద్యంగా అలరారుతూ ఉంది.గండిపైన నిర్మించిన కోట కాబట్టి దీనికి *గండికోట* అనే పేరొచ్చింది. *చరిత్ర కథనం*:        కైఫియత్ ప్రకారం గండికోట దుర్గం త్రైలోక్యమల్ల మొదటి సోమేశ్వర మహారాజు కల్యాణి పట్టణాన్ని రాజధానిగా పాలిస్తూ ములికినాటిసీమలో తన ప్రతినిధిగా కాకరాజును(అసలు పేరు చిద్దన చోళమహారాజు) నియమించాడు.ములికినాడులో అప్పట్లో కడపజిల్లాలోని కమలాపురం,ఎర్రగుంట్ల, ముద్దనూరు,వేముల,వేoపల్లె,వీరపనాయునిపల్లె,తొండూరు,సింహాద్రిపురం,పులివెందుల,జమ్మలమడుగు మొదలైన ప్రాంతాలుండేవి.అప్పట్లో ఒకరోజు కాకరాజు మృగాయావినోదార్థియై తన రాజ్యానికి సమీపం...

వైఎస్ఆర్ కడపజిల్లా

చిత్రం
             Ysr kadapa district map       రాయలసీమలో కడప జిల్లా అంటే ఫ్యాక్షన్‌ ప్రాంతమని చెపుతుంటారు. ఇది ఒకప్పటి మాట.ఇక్కడ బాంబుల తయారీ ఒక  కుటీర పరిశ్రమ అని చాలా మంది భావిస్తారు. ఇది కూడా నలభై ఏళ్ల కిందటి మాట. ఇదే విధానాన్ని ఇప్పటికీ ఈ జిల్లా వాసులు కొనసాగిస్తున్నట్లు సినిమాలు ప్రచారం చేయడంతో అది వాస్తవమని భావించేవారి సంఖ్య అధికంగా వుంది. అయితే కడప జిల్లా బాంబుల జిల్లా కాదు బంగారు జిల్లా అనేందుకు జిల్లాలో అనేక నిదర్శనాలున్నాయి. ఖనిజ సంపదతో పాటు పదకవితా పితామహుడు అన్నమయ్య, కాల జ్ఞాని  పోతులూరి  వీరబ్రహ్మం, ప్రజాకవి వేమన లాంటి వారందరికీ జన్మస్థలం ఈ జిల్లా.  చరిత్రలోకి వెళితే ఈ జిల్లా హిరణ్య రాష్ట్రంగా పిలువబడింది. ఎందరో మహానుభావుల పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది. రాయలసీమ జిల్లాలకు నడిబొడ్డున వున్న కడప గురించి ఎంతగా, ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా చెప్పినా రోజులు చాలవు. భౌగోళిక స్వరూపం  ఉత్తర అక్షాంశం 13 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు 15 డిగ్రీల నుండి 15కు మధ్యగానూ, తూర్పు రేఖాంశం 77 డిగ్రీల నుండి 55 కు, 7...

తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు కోగటం

చిత్రం
తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు  కోగటం                                     అల్లసాని  పెద్దన  తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు  కోగటం          కడప నుంచి ఎర్రగుంట్ల కు వెళ్లే మార్గమధ్యంలో'  కోగటం గ్రామం  కనిపిస్తుంది.ఈ గ్రామం కమలాపురం మండలం పరిధిలో ఉంది. కమలాపురం చౌరస్తాలో అల్లసాని పెద్దన విగ్రహం కనిపిస్తుంది.        కోగటం మండల కేంద్రమైన కమలాపురం నుండి 10 కి. మీ. దూరం లోను,  కడప నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011  గణాంకాల ప్రకారం ఈ గ్రామం 848 ఇళ్లతో, 3400 జనాభాతో 2389 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో పురుషులు 1722, మహిళలు 1678. షెడ్యూల్డ్ కులాలు 448 మంది ఉన్నారు. మొత్తం అక్షరాస్యుల శాతం60.4 % (2053). అందులో మహిళా అక్షరాస్యులు25.4 % (863).          కోగటం పేరు వినగానే గుర్తు కొచ్చే కవి ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన.  ప్రబంధ యుగానికి  ఆది ...