కడప జిల్లా చారిత్రక దృష్టి
కడప జిల్లా చారిత్రక దృష్టి కడప జిల్లా, రాయలసీమలోని రేనాటి సీమలో భాగం. నేటి కడప నాలుగు ప్రధాన చారిత్రక ప్రాంతాలుగా—దేవుని కడప, పురాతన కడప, కాపు కడప, మరియు శహర్ కడప ల సముదాయం. కడప జిల్లా చరిత్రలో రేనాటి చోళుల పాత్ర చాలా కీలకమైనది.వీరి కాలం క్రీ.శ. 575కు సంబంధించిన ఎర్రగుడిపాడు శాసనం (కమలాపురంమండలం) తెలుగు భాషలో వేయబడిన మొట్టమొదటి శిలాశాసనంగా గుర్తించబడింది. ఇది తెలుగు చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ముఖ్యమైన పురావస్తు ఆధారం. దేవుని కడప: దేవుని కడప, తిరుమలకు ఉత్తర ద్వారంగా పిలువబడే ఆధ్యాత్మిక కేంద్రం. దేవుని కడపలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళా లక్షణాలు చోళుల, విజయనగర శిల్పకళా రీతులను. సూచిస్తాయి.ఆలయ గోపురం, శిల్పకళ 9వ-14వ శతాబ్దాల మధ్యకాల దక్షిణ భారత నిర్మాణ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ లభించిన శాసనాల్లో క్రీ.శ. 1570 నాటి సదాశివరాయల కాలం నాటి శాసనం చాలా ముఖ్యం. ఇది ఆలయానికి అప్పట్లో జరిగిన దానధర్మాలను వివరిస్తుంది....