పోస్ట్‌లు

డిసెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు కోగటం

చిత్రం
తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు  కోగటం                                     అల్లసాని  పెద్దన  తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు  కోగటం          కడప నుంచి ఎర్రగుంట్ల కు వెళ్లే మార్గమధ్యంలో'  కోగటం గ్రామం  కనిపిస్తుంది.ఈ గ్రామం కమలాపురం మండలం పరిధిలో ఉంది. కమలాపురం చౌరస్తాలో అల్లసాని పెద్దన విగ్రహం కనిపిస్తుంది.        కోగటం మండల కేంద్రమైన కమలాపురం నుండి 10 కి. మీ. దూరం లోను,  కడప నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011  గణాంకాల ప్రకారం ఈ గ్రామం 848 ఇళ్లతో, 3400 జనాభాతో 2389 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో పురుషులు 1722, మహిళలు 1678. షెడ్యూల్డ్ కులాలు 448 మంది ఉన్నారు. మొత్తం అక్షరాస్యుల శాతం60.4 % (2053). అందులో మహిళా అక్షరాస్యులు25.4 % (863).          కోగటం పేరు వినగానే గుర్తు కొచ్చే కవి ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన.  ప్రబంధ యుగానికి  ఆది ...

చెర్లోపల్లి బురుజు

చిత్రం
                      చెెెెెెెెెెర్లోపల్లి   బురుజు      ఎన్నో కోట్ల ఖర్చుతో నిర్మించే కట్టడాలు ఐదు పదే ళ్లలోనే పగుళ్లుబారతాయి. అలాంటిది సుమారు రెండు వందల ఏళ్ల కిందటి ఆ నిర్మాణం నేటికీ చెక్కుచెదరకుండా చూపరులను ఔరా అనిపిస్తోంది. కదిరి మండలం చెర్లోపల్లి గ్రామంలో 1800 ప్రాంతంలో పూర్తిగా రాళ్లతో సుమారు 60 అడుగుల ఎత్తు బురుజును నిర్మించారు. నాడు ధాన్యం, ఇతర సామగ్రి అపహరించుకెళ్ళేందుకు రాత్రివేళల్లో బందిపోట్లు వచ్చిపడేవారట. అయితే చెర్లో పల్లి పరిసర ప్రాంతాల్లో పెద్ద చెరువు కింద రైతులు పంటలు బాగా పండించేవారు. బందిపోట్ల బారినుంచి కాపాడుకునేందుకు ఇలా బురుజు నిర్మించుకుని అందులో ధాన్యం, ఇతర సామగ్రి దాచేందుకు అరలు ఏర్పాటు చేసుకుని వాటిని గ్రామస్థులే కాపలా కాసేవారంటారు. కాసేవారంటారు. -న్యూస్టుడే, కదిరి పట్టణం

రాయలసీమ లో కాలువలు

హంద్రీ_నీవా సుజల స్రవంతి కాలువ రాయలసీమలోనే పెద్ద కాలువ.అయినప్పటికీ దీన్లో ఒక టిఎంసి లోపు నీరు కూడా పారడంలేదు.దీని మార్గంలో హంద్రీ,పెన్నా, చిత్రావతి, పాపాగ్ని, మాండవ్య,  బాహుదా,గార్గేయ నదులు ఉన్నాయి . . ఈ కాలువ కాలువ రాయలసీమలోని నాలుగు  జిల్లాలకు సాగునీటినందిస్తుంది.దీనికి సమాంతర కాలువ నిర్మిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పారు.వాస్తవ రూపం దాల్చేదెప్పుడు? కె . సి . కెనాల్ . దీనినే కర్నూల్ - కడప కాలువ అంటారు . దీన్ని 150 సంవత్సరాలకు పూర్వమే నిర్మించారు .  కర్నూల్ జిల్లాలో సుంకేసుల బేరేజ్ నుండి మొదలైన ఈ నీటి పారుదల కాలువ కడప , కర్నూలు జిల్లాల్లో సాగునీటిని ,  తాగునీటిని అందిస్తుంది.

నాటి మల్లుల కొండే నేటి మల్లేం కొండయ్య

కడప జిల్లా మెఖంజీ కైఫియత్తుల్లో    (బొడ్డేచెర్ల గ్రామం గోపవరం మండలం,బద్వేలు,కడప( వైఎస్సార్) జిల్లా లోని మల్లెం కొండయ్య గురించి పెదవీరమల్లుడు చినవీరమల్లుడు అనే సోదర రాజులు మల్లెం కొండ ప్రాంతంలో వేటకు వచ్చారు {ఐతే వీరు ఏ ప్రాంతపు రాజులు} పెదవీరమల్లుడు నిండు చూలాలుగా వున్న అడవి పందిని తరుముకుంటూ పోగా, అది ఒక కొండ మీద నుండి కోనలో దూకి ప్రాణాలు విడిచింది. దాని కడుపు పగిలి ఐదు లింగాలు బయటపడ్డాయి {బహుశా మెఖంజీ గారు విషయ సేకరణకెల్లినప్పటికే అసలు చరిత్ర మరుగున పడిపోయి జానపదుల్లో ఈ మహత్యాల జాఢ్యం పేరుకుపోయినట్టు కనిపిస్తోంది} అది శివుని మహిమగా భావించి ఆ సోదరులు ఆ లింగాలను ప్రతిష్టించారు. ఆ ప్రాంతం పంచలింగాల కోన అయ్యింది. ఆ ప్రాంతంలోనే ఆ సోదరులు కోట కట్టుకున్నారు అదే లింగాల కోట అన్నారు { చరిత్రలో ఇలాంటి కథలు జానపదుల్లో చాలానే వుండడం గమనించవచ్చు, ఉదా: హరిహర బుక్కలు ఇలాగే వేటకెల్లి అనువైన ప్రదేశంలో కోట కట్టుకోవడానికై ప్రాచుర్యంలోకొచ్చిన కథ మనకందరికీ తెలిసిందే. అదే విధంగా అనంతపురం బుక్కరాయసంద్రం తర్వాత ఏడావుల పర్తి దయ్యాలకుంట పల్లి తర్వాత వచ్చే దుర్గం అనే అడవి ప్రాంతానికి పాలచెర్ల నుండి వేట...

వేమన - కడప

2000 వేలకు పైగా సరళ తెలుగులో పద్యాలు రాసి, మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను ఎలుగెత్తి ప్రశ్నించిన వేమన ప్రజాకవి. వేమన పుట్టిన ఊరు ఏదన్న విషయంలో పరిశోధకుల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే వేమనది కడప జిల్లా అన్నది అత్యధికుల మాట. వేమన పేరుతో కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయం కూడా నెలకొల్పారు. మరి వేమన కడప జిల్లాకు చెందినవాడు అనడానికి రుజువులు ఏమిటి ? వేమన పద్యాలను సేకరించి వెలుగులోకి తెచ్చిన బ్రౌను వేమన పుట్టుపూర్వోత్తరాల గురించి చెపుతూ  వేమన కాపు కులస్థుడని కర్నూలు ప్రాంతానికి  చెందినవాడని, కాదు గుంటూరు ప్రాంతానికి చెందినవాడని, అది కూడా కాదు కడప జిల్లాలోని   చిట్వేలి గ్రామంలో పుట్టడని కొన్ని వాదనలు ఉన్నాయని అయితే ఖచ్చితంగా ఇదీ వేమన జన్మస్థలం అని నిర్ధారించే సమాచారం ఏదీ దొరకలేదని అంటాడు.  (వేమన పద్యాలు -The Verses of Vemana - Moral, Relivious and Spiritual - Translated by Charles Philip Brown ) 1875లో విడుదల అయిన కడప మాన్యువల్ (The Manual of The District of Cuddapah In the Presidency of Madras ) వేమన గురించి ప్రస్తావిస్తూ కదిరి ప్రాంతంలో (అప్పటికి అనంతపురం...

నిత్య పూజ కోన .

లంకమల అడవిలో అందాల ఆధ్యాత్మిక క్షేత్రం  ==============================  కడప జిల్లా శివాలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడి కొండకోనల్లో చాలావరకు శివుడి ఆలయాలు కనిపిస్తాయి. అలాంటి ఆధ్యాత్మిక ప్రదేశమే నిత్యపూజ కోన క్షేత్రం. చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పెద్ద పెద్ద కొండలు గుట్టల మధ్య ప్రయాణం ... ఇవీ నిత్యపూజకోనకు వెళ్లే మార్గం లోని అనుభూతులు. దీనికి తోడు ఉరికే జలపాతాలు, ఎత్తైన  చెట్ల మధ్య లో సవ్వడి చేసే సెలయేళ్ళు  అక్కడి అందాలను మరింత ధ్విగిణీకృతం చేస్తుంటాయి . ఈ క్షేత్రానికి నిత్య పూజ కోన అనే పేరు రావటానికి కారణం అక్కడ దేవతలు శివుణ్ణి నిత్యం పూజిస్తుంటారు కనుక ఆపేరు వచ్చింది  .... కోరిన కోర్కెలను తీర్చే నిజమైన స్వామిగా పూజలందుకుంటున్న నిత్య పూజ స్వామి  లీలలు అన్నీ ఇన్నీ  కావని చెబుతారు భక్తులు.   అక్కడికి ఎలా వెళ్ళాలి ?  రవాణా మార్గం కడప నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న  సిద్దవటం చేరుకోవాలి.అక్కడి నుంచి దట్టమైన అడవి మార్గాన వెళితే నిత్య పూజ కోన క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండ కింద ఉన్న పంచలింగాల వరకు బస్సులు, ష...

Human Development Index in RAYALASEEMA

చిత్రం
Role of Human Capital in Economic Development Human resources are an important factor in economic development. Economists often see population as an obstacle to growth rather than as a factor which will assist the development activity. Nevertheless, man makes positive contribution to growth. Man provides labor power for production and if in a country labor is efficient and skilled, its capacity to contribute to growth will decidedly be high. The productivity of illiterate, unskilled, disease ridden and superstitious people is generally low and they do not provide any hope to developmental work in a country.  "We shall require a substantially new manner of thinking if mankind is to survive". - Albert Einstein Developing people is the essence of any human resource development effort and it is an important means of all other development activities (plans, policies, programmes, establishment of new structures, mechanisms).  Andhra Pradesh is one of the 29 states of India, situate...

సాహిత్యకారులను నిరంతరం వెంటాడుతున్న వాక్యాలు

సాహిత్యకారులను నిరంతరం వెంటాడుతున్న వాక్యాలు          తరాలు మారినా అభివృద్ధికి నోచుకోని రాయలసీమలో వానరాక , పొలాలు పండక , తిండికి గుడ్డకు చివరికి గుటికెడు మంచినీటికీ కరువై , అప్పుల బరువు మోసుకుంటూ జనాలు హైదరాబాదు, బెంగుళూరు,పూనే, తిరువనంతపురం వంటినగరాలకు వలసలు పోతున్నారు. కరోనా దెబ్బకు లాక్ డౌన్ నేపథ్యంలో సీమనుండి వలస పోయిన కార్మికుల దయనీయ స్థితి ని మనమిప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.      ‌            రాయలసీమ వెనుక బాటుతనాన్ని , కరువును సొమ్ముచేసుకుంటూ  ప్రజలను నిరంతరం వంచిస్తున్న రాజకీయాలు నడుస్తున్నాయి ." హింస , హత్యాకాండల నిలయం , బాంబుల , తుపాకుల ఉత్పత్తి కేంద్రం , కిరాయి హంతక ముఠాల స్థావరం . . ."అంటూ సినిమా లలో, సీరియల్లలో నిరంతరం ప్రచారం చేస్తున్నారు.ఆఖరుకు కొంతమంది రాజకీయ నాయకులు కూడా కడప రౌడీలు, అనంతపురం ఫ్యాక్షన్..అంటూ రాయలసీమ ను చులకన చేస్తూ మాట్లాడుతున్నారు. ఫ్యాక్షన్ బాగా తగ్గిపోయినా రాజకీయ కక్షలతో పల్లెల్లో ప్రజలు వైరివర్గాలుగా విడిపోయారు . ఇవన్నీ సమాజంలో  నైతిక , సాంస్కృతిక విలువలను ధ్వంసం చేస్...

రాయలసీమలో ప్రాచీన మానవుని అడుగుజాడలు

రాయలసీమలో ప్రాచీన మానవుని అడుగుజాడలు              తెలుగునేలపై ఆదిమానవుని అడుగు జాడలను రాయలసీమ లో  పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీంతో ప్రాచీన చరిత్రకు సంబంధించిన,మూలవాసుల సంస్క్రతీ సాంప్రదాయాలకు సంబంధించిన ఎన్నోవిశేషాలు వెలుగులోకి వచ్చాయి. . వివిధ ప్రదేశాల్లో దొరికిన అనేక రకాల పనిముట్లను , వాటి పరిమాణాలను బట్టి ఆనాటి మానవుల జీవన విధానాన్ని అంచనా వేశారు.                        పాతరాతియుగమానవులు నదీ ప్రవాహాల వెంట తిరుగుతూ సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహల్లోనూ , చరియల కింద నివసిస్తూండేవారు . ఆహారం కోసం జంతువులను వేటాడి , సంచార జీవనం గడపే , ఆ కాలాన్ని ఆహార సేకరణ దశ అని అన్నారు . వాతావరణం , జీవన గమనంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా  కొత్త రాతియుగంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొన్నారు. కొత్త రాతియుగం తరువాత ఇనుపయుగంలో ఇనుప పనిముట్లు , స్థానికంగా ఉన్న రాతివనరులు , సమాధుల నిర్మాణానికి దోహదం చేసింది.                 రాయలసిమలో మధ్య , కొత్త రాతి ...

తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ

     తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ                  ఇనుప యుగం కంటే ముందు నుంచి రాయలసీమ ప్రాంతంలో ఆదిమానవులు ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాంతంలో జనపదాలు ఏర్పడి ఉండాలి. పైగా భాష కూడా ఏర్పడి ఉండాలి. జనపదాలు పెద్దవై రాజ్యాలు ఏర్పడిన తర్వాత తొలి శాసనాలు  రాయలసీమలోనే లభించాయు. దీన్నిబట్టి తెలుగువారు రాయలసీమ వారై ఉంటారని భావించవచ్చు .  క్రీ.శ.6వ శతాబ్దం నాటికి దానిని రేనాడు అనిపిలిచే వారు.రేనాడు ఏడువేల గ్రామాల  సముదాయం.దీనిని రేనాటి చోళులు పాలించేవారు. కర్నూలు జిల్లా ఎర్రగుడిపాడు ఎర్రగుడి దగ్గర లభించిన శాసనాల ద్వారా సీమాంధ్ర ప్రాంతం మౌర్య చక్రవర్తి అశోకుని పాలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.       దీన్ని దృష్టిలో పెట్టుకొనే తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ తర్వాత తెలంగాణ అని తుర్లపాటి రాజేశ్వరి పేర్కొన్నారు.       క్రీ.శ.575లో కడప జిల్లా కమలాపురం మండలం లోని కలమల్లలో ఎరికల్ ముత్తు రాజు బిరుదు గల ధనంజయుడనే రాజు రేనాడును పరిపాలిస్తున్న కాలంలో వేయించిన శాసనం తెలుగులో వుంది. కమలాపు...

రాయలసీమ భౌగోళిక లక్షణాలు

రాయలసీమ భౌగోళిక లక్షణాలు  ఏ ప్రాంత చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, నాగరికతలనైనా తీర్చిదిద్దటానికి భౌగోళిక లక్షణాలు ఎంతగానో తోడ్పడతాయి.  రాయలసీమ ప్రాంత చరిత్ర తెలుసుకొనే ముందు ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులను తప్పక తెలుసుకోవాలి. ఆ భౌగోళిక పరిస్థితులే ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల్ని ప్రభావితం చేస్తాయి. భౌగోళిక పరిస్థితులకు, చరిత్రకు విడదీయరాని సంబంధం ఉంది. . రాయలసీమ జిల్లాల ఉత్తర అక్షాంశాలు చిత్తూరు - 12"-37'- 14°, అనంతపురం-13°--41'--15°14',  కర్నూలు -14°-54'-16°18', | వై.ఎస్.ఆర్.కడప - 13°-43'-15°14'. ఆంధ్రప్రదేశ్ జిల్లాల తూర్పు రేఖాంశాలు అనంతపురం - 76°--47'- 78° 26',  చిత్తూరు - 78°-30 - 79°56',  కర్నూలు -77°24'- 79°40', వై.ఎస్.ఆర్.కడప-77°-51'-79°29'. రాయలసీమ అనేక కొండలు లోయల్లతో ప్రకృతి సౌందర్యానికి పుట్టిళ్ళు గా ఉంది. ఈ ప్రాంతంలో శేషాచలం కొండలు, నల్లమల, ఎర్రమల,సాండూరు, గండికోట పర్వతాలు తూర్పు కనుమల్లో భాగంగా ఉన్నాయి. తూర్పుకనుమలు               రాయలసీమ తూర్పు కనుమలు, శేషాచలం పర్వత శ్ర...

నందలూరులో సౌమ్యనాథ్ స్వామిఆలయం

చిత్రం
నందలూరు సౌమ్యనాథ్ టెంపుల్, ఇక్కడ ఒక పెద్ద ఆలయం, పది ఎకరాల ప్రదేశంలో ఉంది. ఇది తిరువన్నమలై యొక్క ప్రతిరూపం.  చోళులు, పాండ్యాలు, కాకతీయ, విజయనగర, పొత్తపి మరియు మాట్లీ రాజులచే రక్షింపబడుతుండేవి. ఇక్కడ శాసనాలు చాలా వరకు తమిళంలో ఉన్నాయి. సౌమ్యనాథుడు ఒక కృత్రిమమైన ప్రదేశంలో ఏర్పాటు చేయబడ్డాడు, తన మెరిసే అందంతో యాత్రికులను ఆకర్షిస్తుంది. గుహలు ఈ ఆలయం  పట్టణంలో చూడదగినది. రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఎలా చేరుకోవాలి:  ఇది కడప -చెన్నై రహదారిపై ఉంది, కడప నుండి 38 కిమీ దూరంలో ఉంది.

తోలుబొమ్మలాట

చిత్రం
తోలుబొమ్మలాట ఉపయోగించే బొమ్మను తయారుచేసే పదార్థాల్ని బట్టి బొమ్మలాటలు 5 రకాలుగా ఉన్నాయి1. తాళ్ల బొమ్మలాటలు (Maricnsttes or sering Peppes). తండుగు బొమ్మలాటలు (Glove Puppets). 3. ఆ బొమ్మలాటలు (Rod Peppers. 4. తోలుబొమ్మలు (Leather Puppets) 5. ఇతరాలు (others) అని ఐదు రకాలు అట్ట బొమ్మలు, కీలుబొమ్మలు, రేకు బొమ్మలు, బుట్టబొమ్మలు అని మరలా నాలుగు రకాలున్నాయి. ప్రాచీన కాలంలో చక్రవర్తులు, మతావలంలు, ధర్మప్రచారకులు ధర్మప్రదోధాలను రకరకాలుగా ప్రచారం చేశారు. అందులో బొమ్మలాటలు కూడా ధర్మప్రభోధ ప్రచార సాధనంగా ఉపయోగపడింది. తర్వాత అది ధర్మప్రబోధంతోపాటు విజ్ఞాన ప్రచార సాధనంగామ. వినోదాత్మకంగాను ప్రచారం పొందింది. బొమ్మలాటల్లో ఎక్కువ ప్రచారం పొందింది తోలుబొమ్మలాట. దాని తర్వాత కొయ్యబొమ్మలాట. తక్కినవి రంగులు ఆకారాలను బట్టి, చిన్నవి - పెద్దవి అని రకరకాల విభజనలు జరిపారు.      తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వ...