పోస్ట్‌లు

ఆగస్టు, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

బాలకొండ ఆంజనేయులు

చిత్రం
                       బి. కుళ్లాయప్ప, సారమ్మల మూడవ సంతానంగా 01.07.1957లో చెన్నో కొత్తపల్లి మండలంలోని బసినేపల్లి గ్రామంలో బాలకొండ ఆంజనేయులు జన్మించారు. ఆయనకు ఇద్దరు అక్కగార్లు, ఒక తమ్ముడు ఉన్నారు.బసినేపల్లిలో  5వ తరగతి పూర్తయ్యాక, ఉన్నత విద్య చెన్నెకొత్తపల్లి, ధర్మవరంలోనూ, బికామ్ డిగ్రి అనంతపురం ఆర్ట్స్ కళాశాలలోనూ పూర్తిచేసినారు. 1980లో జూనియర్ అసిస్టెంట్ గా అనంతపురం పి. టీ.సిలో నియమితులయ్యారు.             బాల్యంలో తన గ్రామంలో మహాభారతం, రామాయణం, పారాయణంలో పాల్గొనేవారు. అప్పట్నించి కవిత్వం పట్ల ఆసక్తి ఏర్పడింది. తాను కవిని కావాలన్న కోరిక ఉండేది. ఇంటర్‌లో తెలుగును ఒక ఆప్షన్‌గా తీసుకోవాలనుకుంటే దానిలో ఎవరూ చేరకపోవడంవల్ల ఆ కోర్సును రద్దు చేసినారు. దాంతో తెలుగును చదువలేకపోయారు. అయినప్పటికి పద్యాలు, గేయకవితలు స్వయంగా రాసేవారు.‌1989లో తాను రాసిన 'తొలకరి చినుకులు' గ్రంథాన్ని జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో‌ ప్రచురించి ఆవిష్కరించారు. ఆవిధంగా సాహిత్య రంగంలోకి ప్రవేశించారు. 1991లో 'ఉచ్చు' ...

నందవరం కేశవరెడ్డి

చిత్రం
                                 నందవరం రామిరెడ్డి, రంగమ్మల చివరి సంతానంగా నందవరం కేశవరెడ్డి తాడిపత్రికి సమీపంలో ఉన్న పెద్ద వడుగూరు మండలంలోని పెద్ద ఎక్కలూరు గ్రామంలో 01.07.1948లో జన్మించారు. అదే గ్రామంలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. 1959లో 6వ తరగతికి ప్రవేశపరీక్ష రాసి పాసై డోస్ దగ్గర నున్న ప్యాపిలిలో రామాంజులు నాయుడు పేదపిల్లలకు ఏర్పాటుచేసిన హాస్టలులో ఉంటూ అక్కడే ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివారు.            1965లో పి. యూ, సిలో సీటు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వెన్నాడుతుండటంతో, ఉద్యోగం వెంటనే వస్తుందన్న ఉద్దేశ్యంతో తిరుపతిలోని ఓరియంటల్ కళాశాలలో విద్వాన్ కోర్సు చదివారు. అప్పట్లో వారు స్టైఫండు కూడా పొందేవారు. నందవరం కేశవరెడ్డికి నలుగురు అన్నలు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 1969లో విద్వాన్ కోర్సును సెకండ్ క్లాస్ లో పాసయ్యారు.తరిమెల రామచంద్రా రెడ్డిగారు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు వారికి పెద్ద పప్పూరు దగ్గర పోస్టింగ్ ఇచ్చినారు. అప్పట్లో ఒక చిన్న తెల్లకాగితపై రాసి...

పాలకుల సీమ లో ప్రగతి పటాటోపం

చిత్రం
పాలకుల సీమ లో ప్రగతి పటాటోపం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి నేటి ఆంధ్ర ప్రదేశ్ వరకు 25 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు .ఇందులో 13 మంది రాయల సీమ నేతలు కావడం గర్వకారణం. చెప్పుకోవడానికి రాయలసీమ వారు ముఖ్యమంత్రులు తప్ప రాయలసీమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. దేశ ప్రగతి ని ప్రశ్నిస్తూ ఆనాడు  కవి కాకి *కోగిర* ఇలా అన్నారు.  " నలుబదేడు వయస్సు మీరిన,నా కుమార్తె స్వతంత్ర భారతి ఏమి లోపమో ! ఎవరి శాపమో ! ఇంకా సమర్తాడలేదు' అని సార్ధకం కాని, సఫలీకృతం కాని స్వాతంత్ర్యానికి పెదవి విరిచారు.  అలా నేడు రాయలసీమ విషయంలో ప్రశ్నించాల్సి వస్తోంది.ఇంతమంది ముఖ్యమంత్రులను ఇచ్చిన రాయలసీమ ను ఎందుకు నిర్లక్ష్యం చేశారు. అడుగడుగున దగా ,మోసం, వంచనకు గురి అవుతున్నాం.  ప్రాజెక్టుల విషయంలో కానీ, పరిశ్రమల విషయంలో గానీ, విద్యా సంస్థల విషయంలో కానీ ,కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కానీ ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా వెనుకబడి ఉన్నాం .ఇందుకు బాధ్యులెవరు ?పాలించిన పాలకుల నిర్లక్ష్యమా? ప్రశ్నించలేని గొంతెత్త లేని రాయలసీమప్రజలదా?  రాయలసీమ ప్రయోజనాలు అనే మౌలిక అంశం పట్ల తమ భిన్నమైన ఆలోచనల...

ఆ పేరెలా వచ్చింది?

‌                    రాయలసీమలో ప్రతి పల్లెకు, చెరువుకు, నదికి, కొండకు, కోనకు, గుహకు, బండకు, కోటకు, గ్రామ దేవతకు,శిష్టదేవతకు, ఒక్కొక్క పేరు వుంటుంది. ఆ పేరెలా వచ్చిందని   ఆ ప్రాంత వాసుల్ని కదిపితే  ఆసక్తి కరమైన ఒక కథ చెబుతారు.సాధారణంగా వ్యక్తుల పేర్లను బట్టి, ఇంటి పేర్లను బట్టి, కులం పేర్లను బట్టి, మిట్ట పల్లాలను బట్టి, పరిమాణాన్నిబట్టి ఊర్ల  పేర్లు ఏర్పడ్డాయి. అనంతపురం              ఈ నగరాన్ని కర్ణాటకకు చెందిన నడియార్ వంశానికి చెందిన అనంతరసు అనే రాజు పాలించాడు.ఆయన పేరు మీద అనంతపురం అనే పేరు వచ్చింది. బుక్కరాయసముద్రం           విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహర రాయలు,బుక్కరాయలలో బుక్కరాయలు అనంత పురానికి దగ్గరలో ఒక చెరువు త్రవ్వించినారు.ఆయన పేరు మీద  బుక్కరాయ సముద్రం అనే వూరు ఏర్పడింది.ఇప్పుడది అనంతపురం జిల్లాలో ఒక మండలం. పుంగనూరు                రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో లో పుంగనూరు అనే ఊరు ఉంది. పుంగనూరు అ...

కడప కరువుల చరిత్ర

కడప కరువుల చరిత్ర           కడప జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని పాతతరం వారిని మీ వయస్సు ఎంత?అని అడిగితే గంజి కరువు, లేదంటే మరో కరువులో పుట్టామని చెప్పడం నేటికీ కనబడుతుంది. కరువులు ఇక్కడి జనజీవనంలో అంతర్భాగమై పోయాయన్నవిషయం దీన్నిబట్టి స్పష్టమౌతుంది. కరువులు, రోగాలు, ఆకలి మరణాలు, వలసలు,నేరాలు, ఘోరాలు ఎన్నో... కలబంద గడ్డలు, దేదారాకు తిని ప్రాణం పట్టుకున్నకాలాలు ఎన్నెన్నో... విజయనగర పాలన మినహాయిస్తే ఆ తర్వాత వచ్చిన పాలకులు గంజి కేంద్రాలు, కరువు పనులు, రెమిషన్లు, కమిషన్లు, యాగాలు, వగైరాలు మినహా శాశ్వత కరువు నివారణకు చేపట్టిన కార్యక్రమాలు స్వల్పం. చరిత్రను ఓమారు అవలోకిస్తే...           1791 - 92లో దక్కన్ పీఠభూమి అంతటా కరువు తాండవించింది . రాయలసీమ ప్రాంతం మరీతల్లడిల్లి పోయింది .         1810 - 13 ( ఫసలీ 1220 -1222 ) లో జిల్లా కరువుతో వణికింది . వరుణదేవుని కరుణా కటాక్ష వీక్షణాలు కోసం దేవాలయాల్లో యాగాలు నిర్వహించడానికి కడప కలెక్టర్ రాస్ నిధులు మంజూరు చేశారు .         ‌‌1822 నుంచి 1824 వరకు మరో కరువు ...

ఆదినిమ్మాయన పల్లి బ్యారేజీ నిర్మాణం కోసం అనుమతులు.

చిత్రం
కుందూనది రాయలసీమలో పుట్టి రాయలసీమలోనే ముగుస్తున్న నది. ప్రతి ఏటా సాదారణ సందర్బాలలో 15-20 TMC లు, అదే పెద్ద వరదలు వచ్చినపుడు 60-70 TMC ల నీటిని తీసుకు వస్తున్న నది కుందూ. కాని ఏమి లాబం ఆ నీరు  కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రజలకు దక్కడం లేదు. కారణం కుందూ నీటిని సీమ ప్రజలకు అందించడానికి తగిన రిజర్వాయర్ లు, చక్ డ్యాంమ్ లు నిర్మించక పోవడమే. నిత్యం త్రాగు నీటికి సైతం కట, కట లాడుతున్న కడప ప్రజలకు జిల్లాలోని ఆదినిమ్మాయన పల్లి బ్యారేజి అవసరం ఉంది. ఇప్పటికే  అనుమతులు ఉన్న కర్నూలు జిల్లా జొలద రాశి, రాజోలి రిజర్వాయర్ లను పూర్ది చేయాలి.  ఆ వైపుగా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం అడుగులు వేయడం మంచి పరిణామం. కుందూనది ప్రాధాన్యత... రాయలసీమ ప్రాంతం గుండా క్రిష్ణ, తుంగబద్ర నదులు ప్రవహిస్దాయి. సగటున ప్రతి ఏటా 1100 TMC ల నీటిని రాయలసీమ ప్రాంతం నుంచే తీసుకెలతాయి. అందులో రాయలసీమకు కేటాయించింది కేవలం 133.7 TMC లే. అందులోను తగిన ఏర్పాట్లు లేకపోవడం, శ్రీశైలంలో 854 అడుగులు నీటి మట్టం నిర్వహించక పోవడం వలన ఆ కొద్ది పాటి నీటిని కూడా వాడుకోలేని దుస్దితి సీమ ప్రజలది. ఉపనది అయిన కుందూ ప్రతి ఏటా అ...

కదిరిలో వికసిస్తున్న కవితా మునీంద్రుడు

చిత్రం
భోగినేని మునీంద్ర జూన్ 1న 1974 లో అనంతపురం జిల్లా నల్లమాడ మండలం లోని రెడ్డిపల్లి గ్రామంలో నరసమ్మ ఓబులేసు దంపతులకు జన్మించారు. ప్రాథమిక ఉన్నత విద్య తన స్వగ్రామంలో ముగించుకొని తనకల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు కదిరి లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎ డిగ్రీ ని 1994లో పూర్తిచేశారు అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చరిత్రను తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగును 2001లో పూర్తి చేశారు. 2005 డిసెంబర్ లో సునందను వివాహం చేసుకున్నారు.వారికి గగన,రేవంతులు జన్మించారు.         తెలుగు భాష పై ఉన్న అభిమానంతో  బిఏలో స్పెషల్   తెలుగు తీసుకోవడమే కాక కవిత్వ రచనకు పూనుకున్నారు. ఆయన రాసిన కవితలు,వ్యాసాలు కడప ,తిరుపతి ,అనంతపురం ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమయ్యాయి. ఆయన రాసిన కవితలకు 2013లో ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ సాహిత్య కళా రత్న బిరుదును, 2014లో గురుబ్రహ్మ బిరుదును ప్రధానం చేసింది. 2014లో తాను రాసిన గేయ మంజరి కవితా సంపుటిని ప్రచురించారు. ఈ కవితా సంపుటికి2015లో శ్ర...

నాలుగు భారీ ప్రాజెక్టులు(ఈనాడు,27.8.2020)

చిత్రం
గండికోటకు మరో 10వేల క్యూసెక్కులకు టన్నెల్ గాలేరు-నగరి, హంద్రీనీవా అనుసంధానానికి రూ.5,036 కోట్లు Galeru Nagari Canal near Gandikota Reservoir                   Hundri neeva canal  గాలేరు నగరి సుజల స్రవంతి పథకు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిని అనుసంధానించేలా ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు రూ. 5,098 కోట్లతో పాలనామోదం ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన పరిశోధన, నిర్మాణ పనులు కలిపి చేసేందుకు వీలుగా వీటికి అనుమతులు మంజూరు చేశారు. అంచనాలు, పని పరిమాణం తదితరాలకు సంబంధించి కొన్ని షరతులతో జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఉన్న ఏ ఇతర ప్యాకేజీ పనులు, ప్రాజెక్టు పనులను అధిగమించేలా ఉండకూదదని అందులో పేర్కొన్నారు. ఆయన బుధవారం మరికొన్ని ప్రాజెక్టులకు పాలనామోద ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. గండికోటకు నీటిని తీసుకువెళ్లేలా అదనపు టన్నెల్ గండికోట జలాశయానికి నీటిని తీసుకువెళ్లేందుకు వీలుగా అదనపు టన్నెల్ నిర్మించనున్నారు. అదనంగా...

కడపలో అరుదైన శాసనం లభ్యం

చిత్రం
జిల్లాలో మరొక అరుదైన శాసనం వెలుగు చూసింది. ఈ ప్రాంతం రేనాటి రాజుల పాలనలో ఉండిందని దీని ద్వారా మరో మారు స్పష్టం అవుతోంది. జిల్లాలోని చిన్న దుద్యాల గ్రామంలో లభించిన దీని గురించి యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు వెలుగులోకి తెచ్చారు. అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.  జిల్లాకు శాసనాల ఖిల్లాగా పేరుంది. రాష్ట్రంలో లభించిన మొత్తం తెలుగు శాసనాలలో ఎక్కువ శాతం వైఎస్‌ఆర్‌ జిల్లాలోనే లభించిన విషయం తెలిసిందే. ఇటీవల జిల్లాలో లభించిన ఓ శాసనం ద్వారా జిల్లా పాలనలో తమదైన ముద్ర వేసిన రేనాటి చోళులు మన జిల్లా వారేనని స్పష్టం అయింది. ఇప్పుడు లభించిన శాసనం ద్వారా అది మరో మారు ధృవీకరింపబడింది.   జిల్లాలోని ముద్దనూరు మండలం చిన్న దుద్యాల గ్రామంలో గల శివనారాయణరెడ్డి పొలంలో ఇటీవల ఓ శాసనం బయల్పడింది. దాని విలువను గ్రహించిన ఆయన దాని గురించిన సమాచారాన్ని తన మిత్రుడు వైవీయూ పరిశోధక విద్యార్థి నిఖిల్‌కు తెలిపారు. ఆయన తన సహచర పరిశోధక మిత్రుడైన వాసుదేవ రెడ్డికి  శాసనం గురించి వివరించారు. వారిద్దరూ కలిసి వైవీయూ చరిత్ర పురావస్తు శాఖ ఆసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రామబ్రహ్మంకు సమాచారం అంద...

'అనంత' సాహిత్యం--ధోరణులు

చిత్రం
                              'ఉత్తమ సాహిత్యం లౌకికజీవితానికి దూరంగా మడి కట్టుకొన్న ప్రత్యేక ప్రపంచం కాదు. అది సమాజ జీవితంలో ఒక భాగం. మానవ మానసిక ప్రపంచంలో ఒక అంతర్భాగం. సంస్కారవంతుల మేధోకార్యకలాపాల్లో ఒక కీలకభాగం. ఉత్తమ సాహిత్యానికి జన్మస్థానం సమాజజీవితమైనట్లే దాని గమ్యస్థానం కూడా సమాజ జీవితమే' అని 'సంవేదన' లో ప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి చెపుతారు. ఈ నేపథ్యం లో కాలానుగుణమైన మార్పులకు అనుగుణంగా వస్తుపరంగా, రూపపరంగా అనంతపురం జిల్లా నుండి వెలువడిన సాహిత్యాన్ని గమనిస్తే ఆధునిక సాహిత్యంలో ఎంతో సుసంపన్నమైన కవిత్వం ప్రవహించింది.         అనంతపురం జిల్లా సామాజిక నేపథ్యంలో కనిపించే వివిధ సమస్యలు కరువు, ప్రాంతీయ చైతన్యం, కార్మిక, కర్షక జీవితాలు, కృంగిపోతున్న సంప్రదాయక కులవృత్తులు, స్త్రీ సమస్యలు, దళిత సమస్యలు, బహుజనవాదం,సామ్రాజ్యవాదం, తీవ్రవాదం, గ్లోబలైజేషన్, జాతీయత, భావుకత, జీవనస్మృతులు వంటి అంశాలన్నింటిని కవితా వస్తువులుగా ఎందరో కవులు స్వీకరించి అనంత సాహితీ సీమ...

చంద్రవదన మొహియార్ అమర ప్రేమ గాథ

చిత్రం
       చంద్రవదన మొహియార్ ప్రేమ గాథ కదిరిలో జరిగిన యధార్థ సంఘటన.          1509_29లో శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలిస్తున్న కాలంలో పర్షియా(నేటి ఇరాన్) దేశంనుంచి కొంతమంది వజ్రాల వ్యాపారస్తులు వచ్చారు. వారు హంపీ తదితర ప్రాంతాలను చూసుకుంటూ కదిరికి కూడా వచ్చినారు. కొన్నాళ్ళు ఇక్కడ కూడా వ్యాపారం చేసినారు. ఆ వ్యాపారస్తుల్లో మొహియార్ అనే యువకుడు  ఉండేవాడు. పాతర్లపట్నంకు చెందిన శ్రీరంగరాయలు కుమార్తె చంద్రవదన ఒక రోజు కదిరికి వచ్చింది. ఆమె మొహియార్‌ను చూసింది. మొహియార్ ఆమెను చూశాడు. వారిద్దరు పరస్పరం ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకున్న అన్నిరకాల అడ్డంకులనూ, మత కట్టుబాట్లనూ అధిగమించి వివాహ బంధంతో ఒక్కటైనారని ఒక కథనం ఉంది. వేర్వేరు మతాలకు చెందిన వీరి ప్రేమ గాథ కదిరిలో మతసామంస్యానికి ప్రతీకగా నిలిచివుంది.           వీరిని గుర్తుచేసుకుంటూ కదిరి పురపాలక సంఘం ఒక ప్రాథమిక పాఠశాలను నెలకొల్పింది. మరో కథ ప్రకారం         విజయనగర సామ్రాజ్యపు సామంత రాజు శ్రీరంగరాయలు పాతర్లపట్నంలో ఉండేవాడు. ఆ ...

సీమ నవలల కళకళలు!

చిత్రం
పాశ్చాత్య సాహిత్యం ప్రభావంతో భారతీయ భాషల్లోకి ప్రవేశించిన ప్రక్రియ నవల. భారతీయ నవలా పితామహుడిగా పేరుగాంచిన బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘దుర్గేశనందిని’ని తొలి భారతీయ నవలగా సాహిత్య చరిత్రకారులు పరిగణిస్తున్నారు. ఈ నవల రచనా కాలం 1865. అంటే భారతీయ నవలది 150 ఏళ్ల చరిత్ర. బెంగాల్‌లో పుట్టిన నవల తర్వాత ఏడెనిమిదేళ్లకు తెలుగు నేలమీద అవతరించింది. అదీ రాయలసీమలో! 1872- 1950 మధ్యకాలంలో తొలితరం సీమ నవలా ప్రస్థానమిది... విస్తృతమైన సామాజిక జీవితాన్ని సాధ్యమైనంత సమగ్రంగా చిత్రించే ప్రక్రియ నవల. తెలుగు నవల మీద పాశ్చాత్య, బెంగాలీ ప్రభావాలు ఉన్నాయి. స్థానిక ఆచార వ్యవహారాలను చిత్రిస్తూ ఏదైనా రచన చేయమని రచద్యిఇ్తఅలను కోరుతూ నాటి గవర్నర్‌ జనరల్‌ (1866- 69) లార్డ్‌ మేయో ఓ ప్రకటన జారీ చేశారు. ఆ పిలుపు అందుకున్న నరహరి గోపాలకృష్ణమ శెట్టి ప్రయత్నంలోంచి పుట్టిందే ‘శ్రీరంగరాజు చరిత్ర’. రచనా కాలం 1872. అయితే ఇందులో చారిత్రకాంశం లేదనీ, నవలా లక్షణాలు లేవనీ దాని ఆద్యతను ఆధునిక విమర్శకులు తిరస్కరించారు. 1878 నాటి కందుకూరి ‘రాజశేఖర చరిత్రము’ను తొలి తెలుగు నవలగా (నిన్నమొన్నటి వరకు) గుర్తించారు. అలా కోస్తా ప్రాంతంల...

నీలం సంజీవరెడ్డి

చిత్రం
నీలం సంజీవరెడ్డి (19 మే 1913 - 01 జూన్ 1996) భారత రాష్ట్రపతిగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్‌సభ సభాపతిగా, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త, ఒక్క సారి ఎం .ఎల్.ఎ ఐతే కోట్లకి పడగలు ఎత్తుతు రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్భాటాలకి పోకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజా నాయకుడు నీలం సంజీవ రెడ్డి. ముఖ్యంగా లోకసభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికారపక్ష -ప్రతిపక్షం మంచి వాతావరణం ఏర్పరచి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన రాయలసీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి గారు .  వ్యక్తిగత జీవితం  అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో 1913, మే 18న రైతుబిడ్డగా సంజీవరెడ్డి జన్మించాడు. మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నాడు. 1935 జూన్ 8 న నాగరత్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.  ...