కదిరిలో పర్యాటక రంగం
కదిరిలో పర్యాటక రంగం కదిరి ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి .ఇందులో తిమ్మమ్మ మర్రిమాను , వేమన మెమోరియల్ కేంద్రము, చంద్రవదన మొహియార్ సమాధి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రముఖంగా ఉన్నాయి .ఇవి కాకుండా కదిరి కి దగ్గరలో హార్స్లీ హిల్స్, పుట్టపర్తి ,లేపాక్షి ఉన్నాయి.ఇవే కాకుండా పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి దేవాలయం, పాల బావి ,కదిరి కొండ, బ్రాహ్మణపల్లి జలాశయము ,వెలిగల్లు జలాశయము ,వేమన జలాశయము , వెంగ ముని ఆలయం ఇలా మొదలైన ప్రాంతాలు అటు పర్యాటక రంగానికి ఇటు యాత్రా స్థలాలుగా ఉపయోగపడుతున్నాయి. వీటన్నిటిని సరైన రీతిలో అభివృద్ధి చేస్తే కదిరి ప్రాంతంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది .దీనివల్ల అనేక వాహనాలకు గిరాకీ ఉంటుంది. వసతి గృహాలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీని వల్ల చాలా మందికి ఉపాధి పెరుగుతుంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు 1. బ్రాహ్మణపల్లి జలాశయం దగ్గర ఒక బృందావనం ను ఏర్పాటు చేయాలి. 2. శ్రీలక్ష్మీ నరసింహ దేవాలయానికి ప్రత్యేక భోజనశాలను నిర్మించాలి. ...